Prabhas: ‘డై హార్డ్ ఫ్యాన్స్’ అంటే ఇలాగే ఉంటారేమో ..!

  • November 12, 2021 / 11:11 AM IST

‘సార్..నా జీవితంలో ఇప్పటివరకు ఒక్క లెటర్ కూడా రాయలేదు.అలాంటిది ఏకంగా సూసైడ్ నోట్ రాస్తానని కలలో కూడా అనుకోలేదు. నా అభిమాన హీరో ప్రభాస్ సినిమా ‘రాధేశ్యామ్’ కి సంబంధించిన అప్‌డేట్స్ ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు రాయాల్సి వస్తోంది. నేను చస్తే అయినా అప్‌డేట్ ఇస్తారని ఆశపడుతున్నాను. చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాను. ఇక వెయిటింగ్ మా వల్ల కాదు. ఫ్యాన్స్ ఎమోష‌న్స్‌తో ఆడుకోవ‌ద్దు. నా చావుకి నిర్మాతలు ‘యువీ క్రియేష‌న్స్’ , దర్శకుడు రాధాకృష్ణ కుమారే కారణం’ అంటూ ఓ ప్రభాస్ అభిమాని సూసైడ్ నోట్ రాయడం సంచలనంగా మారింది.

ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ‘రాధేశ్యామ్’ చిత్రం షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 14న ‘రాధేశ్యామ్’ ను వరల్డ్ వైడ్ గా థియేట‌ర్స్‌లో విడుదల చేస్తామని నిర్మాతలు ఆల్రెడీ ప్రకటించారు.కానీ ప్రమోషన్స్ మొదలుపెట్టింది లేదు. ప్ర‌భాస్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఓ టీజ‌ర్‌ను వదిలారు. కానీ దీపావళికి ఎటువంటి అప్డేట్ లేదు.

మిగతా హీరోల సినిమాలకి సంబంధించిన అప్డేట్లు ప్రతీవారం వస్తూనే ఉన్నాయి. కానీ ‘రాధే శ్యామ్’ అప్డేట్స్ రావడం లేదు. అందుకే ప్రభాస్ ‘డై హార్డ్ ఫ్యాన్స్’ ఇలా రియాక్ట్ అవుతున్నట్టున్నారు. అయితే సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్. దానిని ఇంత పర్సనల్ గా తీసుకోవడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు అని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus