జై లవ కుశ టీజర్ పై రామజోగయ్య శాస్త్రి కవితాత్మక అభినందన
- July 8, 2017 / 11:30 AM ISTByFilmy Focus
బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న సినిమా జై లవకుశ తొలి టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. మొన్న రిలీజ్ అయిన ఈ సినిమా పది డిజిటల్ వ్యూస్ తో దూసుకుపోతోంది. జై పాత్రలో ఎన్టీఆర్ నటనకు అందరూ ఫిదా అయ్యారు. తారక్ లోని కొత్తకోణాన్ని అభిమానులతో పాటు ప్రముఖ దర్శకులు, నటీ నటులు జై కొడుతున్నారు. రీసెంట్ గా గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రి కవితాత్మకంగా అభినందించారు. ‘‘మూస గొలుసులు తెంచుకున్న మాస్ పులి కళ్లతోనే వేటాడుతుంది’’ అంటూ యంగ్ టైగర్ పై ప్రశంసల జల్లు కురిపించారు.
‘‘ఎంట్రీలో ఆ చూపు.. మాటలో ఆ నత్తి.. చివర్లో ఆ నవ్వు.. సరైన ఆహారం దొరికితే పులి అట్టాగే విజృంభిస్తుంది’’ అంటూ తారక్ కి సరైన పాత్ర దొరికితే ఇలాగే విశ్వరూపం ప్రదర్శించారని చెప్పకనే చెప్పారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో వందకోట్ల బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న జై లవకుశ లో తారక్ సరసన రాశీ ఖన్నా, నివేత థామస్, నందితా రాజ్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటులు, హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 21 న థియేటర్లలో రానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















