Rana Daggubati: అమ్మమ్మ పాడె మోస్తూ రానా.. ఫోటో వైరల్!
- January 30, 2025 / 07:17 PM ISTByPhani Kumar
సినీ పరిశ్రమలో ఏదో ఒక విషాదం చోటు చేసుకుంటూనే ఉంది. ఈ ఏడాది చూసుకుంటే దర్శకురాలు అపర్ణ మల్లాది, సీనియర్ నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్, నటుడు యోగేష్ మహాజన్, నిర్మాత మనో అక్కినేని,జయశీలన్,మలయాళ దర్శకుడు షఫీ,స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ (Gopi Sundar) తల్లి లివి సురేష్ బాబు వంటి వారు మరణించారు. ఈ విషాదాల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది.
Rana Daggubati

వివరాల్లోకి వెళితే.. తణుకు మాజీ శాసనసభ్యులు వై.టీ రాజ తల్లి, ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ అయిన యలమర్తి నారాయణ చౌదరి సతీమణి భార్య అయినటువంటి రాజేశ్వరి మృతి చెందారు. వయోభారం, అనారోగ్య సమస్యల వల్ల ఆమె మరణించినట్టు స్పష్టమవుతుంది. ఈ క్రమంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. ఇందులో ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు (D. Suresh Babu), ఆయన పెద్ద కుమారుడు రానా (Rana Daggubati) హాజరు అయ్యారు. రాజేశ్వరి దేవి రానాకు స్వయానా అమ్మమ్మ అవుతారు అనే సంగతి తెలిసిందే.
అందుకే ఈ అంతిమయాత్రలో రానా (Rana Daggubati) పాల్గొని తన అమ్మమ్మ పాడె మోశారు. ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రానాకి తన అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. పలు సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. అలాగే పెద్ద మనవడు రానా అంటే రాజేశ్వరి గారికి కూడా చాలా ప్రేమ. రానా పెళ్లి చూడాలని ఆమె ఎక్కువగా ఆశపడేవారు. అందుకే రానా కూడా కోవిడ్ టైంలో పెళ్లి చేసుకున్నట్టు.. దగ్గుబాటి సన్నిహిత వర్గాలు చెబుతుంటాయి.
అమ్మమ్మ పాడె మోసిన నటుడు రానా దగ్గుబాటి.
తణుకు మాజీ శాసనసభ్యులు వై.టీ రాజా తల్లి, పారిశ్రామికవేత్త యలమర్తి నారాయణ చౌదరి సతీమణి భార్య రాజేశ్వరి మృతి.
ఆమె అంత్యక్రియలకు ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్, కుమారుడు రానా హాజరు.
రాజేశ్వరి దేవి నటుడు రానాకు అమ్మమ్మ, దగ్గుబాటి… pic.twitter.com/OnxfQMI0ku— ChotaNews App (@ChotaNewsApp) January 30, 2025

















