Ranbir Kapoor: రణబీర్ కపూర్ ఆ సినిమా కోసం ఏమి త్యాగం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు..!
October 10, 2023 / 10:47 PM IST
|Follow Us
రణబీర్ కపూర్ తన తదుపరి చిత్రం రామాయణంలో రాముడి పాత్ర పోషించనున్నారు. నితీష్ తివారీ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ సినిమా గురించి రోజుకో కొత్త వార్త తెరపైకి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ చిత్రం కోసం స్టార్ కాస్ట్ తమ జీవనశైలిని మార్చుకుంటున్నారు. రణబీర్ కపూర్ రాముడి లాగా స్వచ్ఛంగా ఉండటానికి మద్యం, మాంసాన్ని వదిలివేయాలని నిర్ణయించుకున్నాడు.
ఈ చిత్రంలో రణబీర్కు (Ranbir Kapoor) జోడీగా హీరోయిన్ సాయి పల్లవి సీత పాత్రలో కనిపించనుంది. రణబీర్ కపూర్ ఇలా మందు మాంసం బంద్ చేయడం తన పబ్లిక్ ఇమేజ్ కోసం కాదు, రామ్ పాత్రకు న్యాయం చేయడం కోసమని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి రణబీర్ మద్యం, నాన్ వెజ్కు పూర్తిగా దూరంగా ఉంటాడు.
అందుకే అతను ఇవన్నీ వదులుకుంటున్నాడు. రణబీర్ లేట్ నైట్ పార్టీలకు కూడా దూరంగా ఉంటున్నాడు. రణబీర్ రామాయణం షూటింగ్.. వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 2024 నుండి రణబీర్, సాయి పల్లవి షూటింగ్లో పాల్గొంటారు. ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది.
మొదటి భాగంలో రాముడు, సీత పాత్రలపై ఎక్కువగా దృష్టి సారించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆగస్ట్ 2024 నాటికి ముగుస్తుంది. ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదల కానుంది. ఈ చిత్రంలో రణబీర్తో పాటు రష్మిక మందన్న, బాబీ డియోల్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.