RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!
- March 30, 2026 / 01:52 PM ISTByFilmy Focus Desk
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ‘రంగస్థలం’ తర్వాత ఈ ఇద్దరూ కాంబోలో తెరకెక్కబోతున్న RC17 ప్రాజెక్ట్పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
RC17
మొదట ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ ను అనుకోగా, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి దేవి తప్పుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కొన్ని సాంకేతిక కారణాలు, డేట్స్ అడ్జస్ట్మెంట్ సమస్యలు, అలాగే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తో చిన్నపాటి విభేదాలు ఈ మార్పుకు కారణమయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా గత ప్రాజెక్టుల సమయంలో వచ్చిన కొన్ని అనుభవాలు ఈ నిర్ణయంపై ప్రభావం చూపించాయనే చర్చలు కూడా ఉన్నాయి.

ఇదిలా ఉంటే, కొత్త మ్యూజిక్ డైరెక్టర్గా బాలీవుడ్లో తనదైన శైలిని నిరూపించుకున్నశాశ్వత సచ్ దేవ్ పేరు బలంగా వినిపిస్తోంది. ఆయన చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్లు, మోడ్రన్ సౌండ్ డిజైన్ ఇప్పుడు మేకర్స్ దృష్టిని ఆకర్షించినట్లు సమాచారం. గ్లోబల్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని ఈసారి మ్యూజిక్ కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని టీమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ మార్పులపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. DSP కొనసాగుతాడా? లేక కొత్త కాంబినేషన్తో సినిమా ముందుకు వెళ్తుందా? అన్నది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశముంది. కెరీర్ మొదటి నుంచి సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన సినిమాలు అన్నింటికీ దాదాపుగా దేవి నే మ్యూజిక్ అందించగా, ఆ చిత్రాలన్నీ మ్యూజిక్ బ్లాక్ బస్టర్లుగా పేరు తెచ్చుకున్నాయి. దీంతో RC17 మ్యూజిక్ విషయంలో ఈ ట్విస్ట్ మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.
















