ఎన్టీఆర్ గడ్డం పెంచడం వెనుక కథ ఏమిటంటే?
- January 23, 2017 / 02:29 PM ISTByFilmy Focus
జనతా గ్యారేజ్ సినిమా రిలీజ్ అయి ఐదు నెలలు గడుస్తున్నా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గడ్డాన్ని తీయడం లేదు. అదే లుక్ ని మెయిన్ టైన్ చేస్తున్నారు. అందుకుగల కారణం బయటికి వచ్చింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఎన్టీఆర్ 27 సినిమాని బాబీ డైరక్ట్ చేయనున్నారు. ఇందులో తారక్ మూడు పాత్రల్లో మెప్పించనున్నారు. ఒక పాత్ర పూర్తిగా గడ్డం లుక్ తో ఆకట్టుకోనున్నట్లు సమాచారం. మిగిలిన రెండు పాత్రలు క్లాస్ లుక్ లో కనిపించబోతున్నట్లు తెలిసింది. ‘జై లవకుశ’ అనే పేరును పరిశీలిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 11 న పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది.
వెంటనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. భారీ బడ్జెట్ తో కల్యాణ్రామ్ నిర్మిస్తున్న ఈ ఫిల్మ్ కి బాలీవుడ్ కెమెరా మెన్ సీ కే మురళీధరన్ ని తీసుకున్నారు. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తుండగా, అందులో ఒకరిగా ఢిల్లీ సుందరి రాశీ ఖన్నా ఫిక్స్ అయింది. జనతా గ్యారేజ్ తర్వాత అనేక కథలు విని తర్క ఒకే చేసిన ప్రాజక్ట్ కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














