ట్వీట్ తో మరో రచ్చ మొదలు !
- April 24, 2017 / 07:40 AM ISTByFilmy Focus
అసలు రాత్రయ్యింది అంటే…ఎవరైన హ్యాపీగా తిని, సుఖంగా నిద్రపోతారు…అయితే అందరూ నిద్రపొయె సమయంలో ఒక్కరు మాత్రం ఒక పెగ్ ఫిక్స్ చేసుకుని…తనకు నచ్చింది…కాదు కాదు…తనకు తోచింది, మనసులో ఉన్న భావాన్ని ట్విటర్ ద్వారా అందరికీ తెలియజేసే ప్రయత్నంలో భాగంగా వివాదాలకు ఆజ్యం పోస్తూ ఉంటాడు…ఇప్పటికీ మీకు అర్ధం అయిపోయి ఉండాలి…ఆ మహానుభావుడు ఎవరా అని…అవును మీ గెస్ కరెక్ట్…నేను మాట్లాడేది అక్షరాల మన రామ్ గోపాల్ వర్మ గురించే….విషయం ఏమిటంటే…ఆర్జీవీ మళ్లీ ట్వీట్ చేశాడు…ఈసారి ఎవరినో తిడుతూ కాదు…ఒక హీరోకి మద్దతుగా మాట్లాడుతూ….విషయం ఏమిటంటే….ప్రతీ ఏటా జరిగే…సినీ అవార్డులు వివాదాస్పదంగా మారుతున్న సంగతి తెలిసిందే….. ఆ వివాదాలకు….సినీ ప్రముఖులు ఈ అగ్నికి మరింత ఆజ్యం పోస్తున్నారు. చల్లారుతున్న సమయంలో మరింతగా మంటలు రాజేస్తున్నారు.
తాజాగా వివాదాస్పద సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ అదేపని చేశారు. కొద్దిరోజులుగా జరుగుతున్న జాతీయ చలన చిత్ర అవార్డుల వివాదంలో ఆయన కూడా ఒక రాయేశారు. అమీర్ ఖాన్ కు మద్దతుగా మాట్లాడి ఈ చర్చను ముగియకుండా చేశారు. కాస్త లోతుల్లోకి వెళితే….రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ… మన దేశంలో ఉన్న గొప్ప ఫిలిం మేకర్లలో అమీర్ ఖాన్ ఒకడని… ఆయనకు అవార్డులు రానంత మాత్రాన ఆయన స్థాయి తగ్గిపోదని అన్నాడు. అమీర్ ప్రతిభను అవార్డుల కమిటీ నిర్ణయంతో కొలవలేమని చెప్పాడు. అసలు ఏ అవార్డుల ఫంక్షన్లకు అమీర్ ఖాన్ హాజరు కాడని అన్నాడు. దీనితో ఈ గొడవ మరింత ముదిరి…తారా స్థాయికి చేరుకునే ప్రమాధం ఉంది అని టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న వాదన…
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.











