రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth).. కన్నడ బ్యూటీ అయినప్పటికీ తక్కువ టైంలోనే తెలుగులో కూడా పాపులర్ అయిపోయింది. ‘సప్త సాగరాలు దాటి- సైడ్ ఎ’ సినిమాలో ఈమె లుక్స్ చూసి తెలుగు యువత ఫిదా అయిపోయింది. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ రుక్మిణీ మాత్రం చాలా మందికి క్రష్ అయిపోయింది. తెలుగులో ఆమెకు భీభత్సమైన క్రేజ్ ఏర్పడింది. ‘సప్త సాగరాలు దాటి సైడ్ -బి’ పై ఆసక్తి పెరగడానికి కూడా అదే కారణం.
అయితే నిఖిల్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాతోనే రుక్మిణీ వసంత్ టాలీవుడ్ డెబ్యూ ఇవ్వాలి. కానీ ఆ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోవడం.. తర్వాత ఆమె కన్నడలో చేసిన సినిమాలు, తమిళంలో చేసిన సినిమాలు రిలీజ్ అవ్వడం.. అవి ప్లాప్ అవ్వడంతో రుక్మిణీ ఇంకా ఇక్కడ స్టార్ కాలేదు.
అయినప్పటికీ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్'(వర్కింగ్ టైటిల్) లో మెయిన్ హీరోయిన్ గా ఎంపికైంది. ఇక ఈ సినిమా కోసం ఆమె రెమ్యూనరేషన్ భారీగా అందుకుంటున్నట్టు టాక్ నడుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ బడా ప్రాజెక్టు కోసం రుక్మిణీ వసంత్ రూ.5 కోట్ల నుండి రూ.6 కోట్ల వరకు డిమాండ్ చేసిందట.
ఆమె టీం, మేకప్ వంటి వాళ్ళ ఖర్చులు అన్నీ కలుపుకుని అనమాట. అందుకు దర్శక నిర్మాతలు కూడా సంతోషంగా ఓకే చెప్పేశారట. ఈ సినిమా కనుక హిట్ అయితే రుక్మిణీ రేంజ్ టాలీవుడ్లో మరింత పెరగడం ఖాయం అనే చెప్పాలి.