ఫిదా మూవీ తో సాయి పల్లవి రేంజ్ మారిపోయిందిగా!
- July 22, 2017 / 11:03 AM ISTByFilmy Focus
మలయాళం ప్రేమమ్ మూవీ తో ఒక్కసారిగా ఫ్రేమ్ లోకి వచ్చిన సాయి పల్లవి అతి తక్కువ టైంలో అక్కడ తన యాక్టింగ్, డాన్సింగ్ స్కిల్ తో ఫుల్ ఫాలోయింగ్ పెంచేసుకుంది. అయితే ఆమె తెలుగులో ఎంట్రీ కోసం చాలా మంది ప్రేక్షకులు వెయిట్ చేసారు. ఇప్పుడు ఫిదా సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి ప్రేక్షకులకు పక్కింటమ్మాయి ఫీలింగ్ తెచ్చేశాయి. తెలుగులో సొంతంగానే డబ్బింగ్ చెప్పుకొని.. తన సహజ నటనతో మంత్రముగ్ధులను చేసింది. ఒక్కసారిగా ఇటు ఇండస్ట్రీలో, అటు అభిమానుల్లో అందరి ద్రుష్టి తన వైపు తిప్పుకుంది.
ఫిదా సినిమాలో అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్ తో ఒక్కసారిగా విపరీతమైన అభిమానులని సొంతం చేసుకుంది. ఈ సినిమా చూసిన అందరు చాలా వరకు సాయి పల్లవి ఫ్యాన్స్ అయిపోయారంటే. ఫిదా సినిమాలో ఆమె ఇంపాక్ట్ ఎ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక టాలీవుడ్ లో ఆమె టాప్ రేంజ్ లోకి వెళ్తుంది అని ఇప్పటికే సినిమా ప్రముఖులు కితాబు ఇచ్చేసారు. ఫిదా మూవీపై ఓవరాల్ గా అన్ని ఏరియాల నుంచి అద్భుతమైన టాక్ వస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఫిదాకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















