Sai Pallavi: ఓటీటీపై సాయిపల్లవి ఫోకస్!

  • September 24, 2021 / 04:06 PM IST

లాక్ డౌన్ సమయంలో ఓటీటీలకు డిమాండ్ బాగా పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఒరిజినల్ కంటెంట్ పై దర్శకనిర్మాతలు ఫోకస్ పెట్టారు. ఓటీటీ క్రేజ్ చూసి పెద్ద పెద్ద స్టార్లు సైతం డిజిటల్ డెబ్యూకి రెడీ అయిపోతున్నారు. బాలీవుడ్ లో అజయ్ దేవగన్, షాహిద్ కపూర్ లాంటి పెద్ద హీరోలు వెబ్ సిరీస్ ల బాటపట్టడం తెలిసిందే. తెలుగులో విక్టరీ వెంకటేష్, రాజా డిజిటల్ డెబ్యూకి రెడీ అవుతున్నట్లు తాజాగా ప్రకటన వచ్చేసింది.

త్వరలోనే సాయిపల్లవి ఓ వెబ్ సిరీస్ చేయబోతోందని సమాచారం. తన కొత్త సినిమా ‘లవ్ స్టోరీ’ ప్రమోషన్స్ లో భామగా మీడియాకు కలిసిన సాయిపల్లవి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయబోతున్నారని సాయి పల్లవిని ప్రశ్నించగా.. తెలుగులో కొన్ని పెద్ద సినిమాల కోసం చర్చలు జరుగుతున్నట్లు.. అలానే తమిళం, మలయాళం, హిందీ భాషల నుంచి కూడా అవకాశాలు వస్తున్నట్లు సాయిపల్లవి చెప్పింది. వాటిలో ఏవీ ఫైనల్ కాలేదని చెప్పిన ఆమె..

ప్రస్తుతం తను ఒక వెబ్ సిరీస్ కు సంబంధించిన కథ వింటున్నట్లు చెప్పింది. దానిపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని.. త్వరలోనే నిర్ణయం చెబుతానని వెల్లడించింది. ఇప్పటికే సాయిపల్లవి తమిళంలో ‘పావ కథైగల్’ అనే ఆంథాలజీ కాన్సెప్ట్ లో నటించింది. దానిని ఓటీటీ వేదికగా విడుదల చేశారు.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus