అభిమానులూ జాగ్రత్త: పవన్ కళ్యాణ్
- March 19, 2016 / 12:34 PM ISTByFilmy Focus
రేపు (మార్చి 20న) “సర్దార్ గబ్బర్ సింగ్” ఆడియో వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరగున్న సందర్భంగా అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండడంతో.. తొలుత పోలీసు పర్మిషన్లు లభించనప్పటికీ.. తెలంగాణ ప్రభుత్వం మరియు తెలంగాణ మంత్రులు కేటీయార్, హరీష్ రావు గార్లు అందించిన సహకారంతో పోలీస్ పర్మిషన్లు దక్కాయని, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆడియో వేడుక జరుగుతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఈ వేడుకకు అన్నయ్య చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేస్తున్నారని పవన్ స్పష్టం చేశారు.
ఆడియో వేదిక వద్దకు కేవలం పాసులు ఉన్న వారు మాత్రమే రావాలని, పాసులు లేని వారు వచ్చి ఇబ్బంది పడరాదని పవన్ కోరారు
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

















