సాహో షూటింగ్ లో పాల్గొనేందుకు ఉత్సాహాపడుతున్న శ్రద్ధ కపూర్
- August 17, 2017 / 09:43 AM ISTByFilmy Focus
బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సాహో సినిమాలో హీరోయిన్ గా శ్రద్ధ కపూర్ ఫైనల్ అయింది. యువ డైరక్టర్ సుజీత్ అనేక మంది బాలీవుడ్ బ్యూటీల నుంచి వడబోసి ఈ ముద్దుగుమ్మను సెలక్ట్ చేశారు. దీపికా పదుకునే, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్ వంటి అందగత్తెలతో పోటీ పడి ఈ అవకాశాన్ని దక్కించుకున్నందుకు శ్రద్ధ కపూర్ చాలా ఆనందంగా ఉంది. పైగా ప్రభాస్ పక్కన నటించే కల తొందరగా తీరినందుకు సంతోషపడుతోంది. తనలోని ఆనందాన్ని ట్విట్టర్ వేదికపై ఆమె ఈరోజు పంచుకుంది. “సాహో టీమ్ లో నేను భాగం అయినందుకు చాల ఆనందంగా ఉంది. ప్రభాస్ పక్కన నటించబోతున్నానహో” అంటూ ట్వీట్ చేసింది.
షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా ? అని ఆతృతగా ఉంది. యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు 225 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీలోని కొన్ని సీన్లు హైదరాబాద్ లో చిత్రీకరించారు. ముంబై లో మొదలుకానున్న భారీ షెడ్యూల్ లో ప్రభాస్, శ్రద్ధ కపూర్ ఇతర నటీ నటులు పాల్గొననున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















