కాటమరాయుడులోని సంగతులను చెప్పిన శృతిహాసన్
- February 22, 2017 / 01:44 PM ISTByFilmy Focus
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాక్షన్ లీడర్ గా నటిస్తున్న కాటమరాయుడు సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. హీరోహీరోయిన్ల మధ్య నిన్నటి నుంచి హైదరాబాద్ లో రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో కాటమరాయుడు గురించి ఆసక్తికర సంగతులను చెప్పింది. ” రీమేక్ అంటే ఉన్నది ఉన్నట్టు తీస్తారని అనుకోవడం సహజం. కానీ ‘కాటమరాయుడు’ అలా కాదు. ‘వీరమ్’ కి దీనికి చాలా తేడాలున్నాయి. తెలుగు నేటివిటీకి తగ్గట్టు ఇందులో చాలా మార్పులు చేశారు. రెండింటినీ పోల్చి చూడలేం. పూర్తి స్థాయి ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దీనిని డైరక్టర్ తీర్చిదిద్దుతున్నారు” అని శృతి హాసన్ వెల్లడించింది.
ఈ చిత్రం పవన్ అభిమానులనే కాకుండా, ప్రతి ఒక్కరినీ అలరిస్తుందని చెప్పింది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ ఫిల్మ్ ని నార్త్ స్టార్ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఫిబ్రవరిని 5 న విడుదలైన ఈ మూవీ టీజర్ రికార్డులను క్రియేట్ చేసింది. సినిమాలపై అంచనాలను పెంచింది. అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్న ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 24న థియేటర్లోకి రానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















