Spiderman – Odyssey: స్పైడర్ మ్యాన్కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్ థియేటర్లు.. ఏమైందంటే?
- June 28, 2026 / 09:51 AM ISTByFilmy Focus Desk
తెలుగు సినిమాలో ఒకప్పుడు రెగ్యులర్గా, ఇప్పుడు ఏదో సీజనల్గా వినిపించే అతి పెద్ద చర్చ ‘థియేటర్లు చాలవు’. ఇప్పుడు దీనిని స్క్రీన్లు సరిపోవు అని కాస్త అప్డేట్ చేస్తున్నారు అనుకోండి. భవిష్యత్తులో థియేటర్లు అన్నీ స్క్రీన్లు అయిపోయే అవకాశం ఉంది అనుకోండి. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఈ ‘స్క్రీన్లు చాలవు’ చర్చ హాలీవుడ్కి చేరింది. దీనికి కారణం రెండు అతి పెద్ద సినిమాలు రెండు వారాల గ్యాప్లో థియేటర్లలోకి వస్తుండటమే. ఆ సినిమాలో ‘స్పైడర్ మ్యాన్’, ‘ది అడెస్సీ’.
Spiderman – Odyssey
హాలీవుడ్ దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ సినిమా వస్తోంది అంటే ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంటుంది. దానికి కారణం ఆయన ఎంచుకున్న కథతోపాటు దానికి జోడించే అత్యున్నత సాంకేతిక విలువలు. అందుకే నోలన్ సినిమాలను ఐమ్యాక్స్ తెరపైనే చూడాలని ప్రేక్షకులు కోరుకుంటారు. ఈ మేరకు బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే సోల్డ్ అవుట్ అయిపోతుంటాయి. దానికి తోడు సినీ చరిత్రలోనే తొలిసారిగా ‘ది ఒడిస్సీ’ సినిమా మొత్తాన్ని ఐమ్యాక్స్ 70 ఎంఎం కెమెరాలతో చిత్రీకరించారని చెప్పడంతో ఫ్యాన్స్ ఇంకా రెడీ అయిపోయారు.
గ్రీకు పురాణాల్లోని ఒడిస్సియస్ అనే రాజు జీవితం ఆధారంగా ‘ది అడెస్సీ’ సినిమాను రూపొందించారు. జులై 17న ఈ సినిమా విడుదల కానున్న నేథ్యలో మన దేశంతోపాటు ప్రపంచంలోని అన్ని ఐమ్యాక్స్ స్ర్కీన్లను ఈ సినిమా కోసమే కేటాయించారు. ఒకట్రెండు రోజులు కాదు.. కొన్నివారాల పాటు ఈ సినిమా కోసం ఆ స్క్రీన్లను బ్లాక్ చేశారట. ఇక్కడివరకు అంతా బాగుంది. అయితే స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ మాత్రం హర్ట్ అవుతున్నారు. ఎందుకంటే జులై 31న వారి కొత్త సినిమా ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ వస్తోంది. ఆ సినిమా కోసం భారత్లోని ఐమ్యాక్స్ స్ర్కీన్లు అందుబాటులో లేవట.
ఎందుకో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ‘స్పైడర్మ్యాన్’ ఫ్రాంఛైజీలో వస్తున్న ‘స్పైడర్మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ను ఐమ్యాక్స్ థియేటర్లలో ప్రదర్శించడానికి వీలుగా 1.90:1 యాస్పెక్ట్ రేషియోలో చిత్రీకరించారు. కానీ స్క్రీన్లు అందుబాటులో లేవు.














