సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత !
- November 3, 2024 / 02:49 PM ISTByFilmy Focus
దేశమంతా దీపావళి సెలబ్రేషన్స్ జరుపుకుని రెండు, మూడు రోజులు కూడా కాలేదు. ఇలాంటి టైంలో కూడా వరుసగా బ్యాడ్ న్యూస్ లు వినాల్సి వస్తుంది. సినీ పరిశ్రమలో ఓ విషాదం చోటు చేసుకుంది. కొన్నాళ్లుగా సినీ పరిశ్రమకు చెందిన వారు ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు. తాజాగా ఓ దర్శకుడు ఫ్యాన్ కి ఉరేసుకుని మరణించడం హాట్ టాపిక్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.. కన్నడ దర్శకుడు ‘మఠం’ ఫేమ్ గురుప్రసాద్ (Guru Prasad) బలవన్మరణానికి పాల్పడ్డారు.
Guru Prasad

అతని న్యూ హెవెన్ అపార్టుమెంట్లో ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారట. ఆదివారం నాడు గురు ప్రసాద్ ఇంట్లో దుర్వాసన రావడంతో.. ఇరుగుపొరుగు జనాలు వెళ్లి చూశారట. అక్కడ ఘోరమైన స్థితిలో అతని శవం కనిపించినట్టు తెలుస్తుంది. దీంతో వాళ్ళు వెంటనే పోలీసులకి కాల్ చేసి విషయం చెప్పారట. అనంతరం గురుప్రసాద్ మృతదేహాన్ని బయటకు తీశారట.అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులకి ఎటువంటి ఆధారాలు లభించలేదట.

అయితే ఈ అపార్టుమెంట్లో గురుప్రసాద్ 8 నెలల నుండి నివసిస్తున్నాడట. ముందుగా అతను గిరినగర్లో నివసించేవాడట. తర్వాత బెంగళూరు నార్త్ లో ఉన్న మదనాయకనహళ్లిలోని టాటా న్యూ హెవెన్లో ఉన్న అపార్ట్మెంట్ కి షిఫ్ట్ అయినట్లు తెలుస్తుంది. ఇతనికి రెండు పెళ్లిళ్లు కూడా అయ్యాయి. అంతకు మించి ఇతని పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువ విషయాలు లభించలేదు. ‘మఠం’ ‘డైరెక్టర్ స్పెషల్’ ‘ఎడ్డెలు మంజునాథ్’ ‘రంగనాయక’ వంటి చిత్రాలకు ఇతను దర్శకత్వం వహించాడు. రైటర్ గా కూడా ఇతను బాగా ఫేమస్.













