ఆ విషయంలో చిరంజీవి మాట లెక్క చేయుండా కోట్లు పోగోట్టుకున్న నిర్మాత..!

  • November 24, 2023 / 09:11 PM IST

టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ 2 నిర్మాత లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా దిల్ రాజ్ ఉంటారు. ఇయన వరుస హిట్ సినిమాలతో నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన ప్రొడక్షన్ కంపెనీ నుండి ఒక సినిమా వస్తుంది అంటే కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అనే ముద్ర పడిపోతుంది. ఆ స్థాయి బ్రాండ్ వేల్యూ ని ఏర్పాటు చేసుకున్నాడు దిల్ రాజు. ముఖ్యంగా కథలను జడ్జి చేసే విషయం లో దిల్ రాజుని మించిన నిర్మాత టాలీవుడ్ లోనే లేరని అందరూ అంటూ ఉంటారు.

కానీ మెగాస్టార్ విషయం లో మాత్రం ఆయన లెక్క తప్పింది అని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. అసలు విషయానికి వస్తే అప్పట్లో దిల్ రాజు రామ్ చరణ్ తో ‘జోష్’ చిత్రాన్ని చెయ్యాలని అనుకున్నాడట. ఇది రామ్ చరణ్ మొదటి చిత్రం గా తియ్యాలని దిల్ రాజు చాలా కలలు కన్నాడట. అయితే అప్పట్లో ఆయన చిరంజీవి ని కలిసి ఈ సినిమా స్టోరీ వినిపించిన తర్వాత కథలో చాలా లోపాలు ఉన్నాయి, ఇది వర్కౌట్ అవ్వదు అని చెప్పాడట.

అయితే దిల్ రాజు (Dil Raju) లేదు సార్ కచ్చితంగా చరణ్ కి సరిపోతుందని చిరంజీవిని ఒప్పించే ప్రయత్నం చేసాడట. ఒక్కసారి నాగబాబు కి ఈ కథని వినిపించి అతని ఫైనల్ నిర్ణయం తీసుకో అని చిరంజీవి చెప్పడట. నాగబాబు కూడా చిరంజీవి చెప్పినట్టే చెప్పడం తో, ఇదేంటి ఇంత మంచి కథలో ఏమి లోపాలు కనిపించాయి వీళ్లకు అని మనసులో అనుకుంటూ వెళ్ళాడట. అప్పుడే నాగార్జున తన పెద్ద కొడుకు నాగచైతన్య ని లాంచ్ చెయ్యడానికి కథలు వింటూ ఉన్నాడు.

అలా దిల్ రాజు వద్ద జోష్ స్టోరీ వినడం వెంటనే ఓకే చెప్పి నాగ చైతన్య తో ఈ సినిమా చేసాడు. ఫలితంగా ఈ చిత్రం పెద్ద ఫ్లాప్ అయ్యి పాతిక కోట్ల రూపాయిల నష్టాన్ని మిగిలించిందట. అలా చిరంజీవి మాట కాదు అన్నందుకు నాకు ఇలా జరిగింది అంటూ చెప్పుకొచ్చాడు దిల్ రాజు. ప్రస్తుతం రామ్ చరణ్-దిల్ రాజ్ కాంబినేషన్ లో గేమ్ ఛేంజర్ వస్తోంది.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus