ఆ రాజు వొద్దన్నాడు… ఈ రాజు రమ్మన్నాడు…
- August 19, 2017 / 05:50 AM ISTByFilmy Focus
సినిమా అవకాశం ఎవరికీ ఊరికే రాదు, కానీ ఇండస్ట్రీలో ఎవరైనా తెలిసినవాళ్లు లేదా కుటుంబ సభ్యులు ఉంటే మాత్రం కాస్తంత సులభతరం అవుతుంది. అది కూడా మొదటి అవకాశం వరకే ఆ తర్వాత మాత్రం తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకొని సదరు నటి/నటుడు ముందుకు సాగాల్సిందే. అయితే.. బాలీవుడ్ లోని అందరు అగ్ర కథానాయకులతో కలిసి నటించిన అనుభవంతోపాటు ప్రముఖులతో పరిచయాలు కూడా ఉన్న శక్తి కపూర్ తనయ శ్రద్ధాకపూర్ సినిమా ఎంట్రీ మాత్రం అంత ఈజీగా అవ్వలేదు. బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోనూ ఆమెకు ఆఫర్లు ఇవ్వడానికి తొలుత నిరాకరించినవారు చాలామంది ఉన్నారు. నీ స్క్రీన్ ప్రెజన్స్ బాలేదు అని నువ్వసలు నటిగా పనికిరావు చాలా మంది శ్రద్ధాకపూర్ మొహం మీదే చేప్పేసేవారట.
అందులో ప్రముఖ తెలుగు నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. “ఆషికి 2” కంటే ముందు శ్రద్ధకపూర్ హైద్రాబాద్ లో ఉన్న తన స్నేహితుల ద్వారా దిల్ రాజు అప్పాయింట్ మెంట్ తీసుకొని ఆయన్ని కలిస్తే.. “నువ్వు తెలుగులో కష్టం అమ్మా” అంటూ చాలా హుందాగా సమాధానం చెప్పి వెళ్లిపోయాడట దిల్ రాజు. ఆ తర్వాత శ్రద్ధాకపూర్ బాలీవుడ్ లోనే నటిగా నిలదొక్కుకొని ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మక ప్రోజెక్ట్ “సాహో”లో సోలో హీరోయిన్ గా నటించే అవకాశం సొంతం చేసుకోవడం గమనార్హం. అంతే మరీ.. “ఎవరిలో ఎంత ఉంది అనేది వారికే తెలుస్తుంది” అని “మున్నా” సినిమాలో ప్రభాస్ చెప్పిన డైలాగ్ వేల్యూ ఇప్పుడు తెలుస్తుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















