చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ స్కామ్ లో భాగంగా అరెస్ట్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఈయనను ఆదివారం రాజమండ్రి జైలుకు తరలించారు. అయితే చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. కానీ ఇప్పటివరకు నందమూరి హరికృష్ణ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఈ ఘటనపై స్పందించలేదు ముఖ్యంగా ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఈ విషయంపై నోరు కూడా విప్పడం లేదు.
ఈ క్రమంలోనే ఈ ఘటనపై ఎన్టీఆర్ స్పందిస్తే బాగుండు అని ఎంతోమంది తెలుగుదేశం కార్యకర్తలు ఆశగా ఎదురు చూస్తున్నప్పటికీ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించలేదు అయితే ఈ విషయంపై పలువురు ఎన్టీఆర్ పట్ల విమర్శలు కూడా కురిపిస్తుండగా మరికొందరు మాత్రం ఎన్టీఆర్ స్వయంగా జగన్మోహన్ రెడ్డికి థాంక్యూ చెబుతున్నటువంటి పోస్టర్లను అతికించడంతో ఇది కాస్త సంచలనంగా మారింది.
థాంక్యూ జగన్ (Jagan) అని ఉన్నటువంటి ఈ పోస్టర్లో ఏముంది అనే విషయానికి వస్తే.. నన్ను చివరి దశలో అనేక అవమానాలు అత్యంత శోభకు గురిచేసి నా మరణానికి కారణమైన ఒక నీచుడు చంద్రబాబు నేను చనిపోయాక నా మరణాన్ని వాడుకున్నారు. అలాగే నా కుమారుడు హరికృష్ణ మరణాన్ని కూడా చంద్రబాబు నాయుడు తనకుటిల రాజకీయాలకు వాడుకున్నారు .ఇక చంద్రబాబు నాయుడు కొడుకు నీచ రాజకీయాలకు నా మనవడు తారకరత్న మరణాన్ని కూడా ఉపయోగించుకున్నారు.
ఇలాంటి నీచుడికి బుద్ధి చెప్పి నా ఆత్మకు శాంతి చేకూర్చావు నీచుడు దుర్మార్గుడైన చంద్రబాబు సెప్టెంబర్ 10న జైలుకెళ్ళిన సందర్భంగా తెలుగు ప్రజలందరూ కూడా చాలా సంతోషంతో ఉన్నారని, ఈ రోజున తెలుగు వారందరూ కూడా నా ఆత్మ శాంతించిన రోజుగా జరుపుకోవాలని అంటూ ఈ సందర్భంగా సీనియర్ ఎన్టీఆర్ తెలియచేస్తూ ఉన్నటువంటి ఒక పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.