ఆయన ఫ్యాన్స్ నన్ను కొడతారేమో అని భయపడ్డాను!
- September 13, 2019 / 09:35 AM ISTByFilmy Focus
నందమూరి బాలకృష్ణ.. ఈ పేరులోనే ఒక పవర్ ఉంటుంది.. ఆయనంటే జనాలకి ఒక రకమైన భయం ఉంటుంది. కానీ.. మన బాలయ్య నిజానికి చాలా మంచోడండీ. కానీ.. తన అతి కోపం వల్ల అప్పుడప్పుడూ అభాసుపాలవుతుంటాడు. ఈ విషయం ఆయన్ని దగ్గరగా చూసిన చాలా మందికి తెలుసు.. బాలయ్య ఎంత మంచోడు అనే విషయం. ఆయన అభిమానులు మాత్రమే కాదు.. ఆయనతో కలిసి నటించిన హీరోయిన్లు కూడా ఆయన పేరు చెబితే భయపడి చచ్చేవారట. వాళ్ళలో సంఘవి ఒకరు.

బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన “సమరసింహా రెడ్డి” చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించిన సంఘవి.. తొలుత బాలయ్యతో షూటింగ్ అంటే మొదట చాలా భయపడిందట. షూటింగ్ స్పాట్ లో కూడా సైలెంట్ గా ఉండేదట. ఇది గమనించిన బాలయ్య ఒకసారి వెళ్ళి అడిగాడట.. ఏంటమ్మా సైలెంట్ గా ఉంటున్నావ్ అని. సంఘవి ఇలా అని రీజన్ చెప్పగా.. “నేను రోజు వాకింగ్, యోగా, ధ్యానం చేస్తాను.. అందువల్ల పెద్ద కోపం ఏమీ ఉండదు” అని నవ్వేశాడట. అప్పట్నుంచి షూటింగ్ స్పాట్ లో సరదాగానే సాగిందట షూటింగ్ మొత్తం. ఇక సినిమాలో ఆయన్ని కొట్టాల్సిన సీన్ లో ఆయన్ని కొడితే.. తర్వాత బాలయ్య ఫ్యాన్స్ అందరూ ఆమెను కొడతారేమోనని భయపడిందట. కానీ.. బాలయ్య ఏమీ కాదులే అని చెప్పి సీన్ లో ఆమెతో చెంప దెబ్బ తిన్నాడట.













