Varalaxmi Sarathkumar, Balakrishna: మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసిన వరలక్ష్మీ!

నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ సినిమాను పూర్తి చేసిన తరువాత గోపీచంద్ మలినేనితో కొత్త సినిమా మొదలుపెట్టనున్నాడు. నిన్న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా దీనికి సంబంధించిన అధికార ప్రకటన వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ అనౌన్స్మెంట్ రాగానే బాలయ్య ఫ్యాన్స్ ఖుషీ అయిపోయారు. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ ఏడాది ‘క్రాక్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్.. జయమ్మ అనే పాత్రలో మెప్పించింది. విలన్ బ్యాచ్ లో ఉండే ఈ రోల్ వరలక్ష్మీకి మంచి పేరుని తీసుకొచ్చింది. ఈ సినిమాతో అమ్మడుకి టాలీవుడ్ లో అవకాశాలు పెరిగాయి. ఇప్పుడు గోపీచంద్ మరోసారి ఆమెని తన సినిమాలో తీసుకోవాలనుకుంటున్నారు. బాలయ్య సినిమాలో కీలకపాత్ర కోసం ఆమెని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. అలానే ‘క్రాక్’ సినిమాలో నటించిన కొందరు తారలు ఈ సినిమాలో కూడా కనిపిస్తారట.

వీరితో పాటు ‘క్రాక్’ సినిమాకి పనిచేసిన కొందరు టెక్నీషియన్స్ ను కూడా గోపీచంద్ మలినేని రిపీట్ చేయబోతున్నారు. ఇప్పటికే థమన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా అనౌన్స్ చేశారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus