Varalaxmi Sarathkumar, Balakrishna: మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసిన వరలక్ష్మీ!

  • June 11, 2021 / 05:05 PM IST

నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ సినిమాను పూర్తి చేసిన తరువాత గోపీచంద్ మలినేనితో కొత్త సినిమా మొదలుపెట్టనున్నాడు. నిన్న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా దీనికి సంబంధించిన అధికార ప్రకటన వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ అనౌన్స్మెంట్ రాగానే బాలయ్య ఫ్యాన్స్ ఖుషీ అయిపోయారు. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ ఏడాది ‘క్రాక్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్.. జయమ్మ అనే పాత్రలో మెప్పించింది. విలన్ బ్యాచ్ లో ఉండే ఈ రోల్ వరలక్ష్మీకి మంచి పేరుని తీసుకొచ్చింది. ఈ సినిమాతో అమ్మడుకి టాలీవుడ్ లో అవకాశాలు పెరిగాయి. ఇప్పుడు గోపీచంద్ మరోసారి ఆమెని తన సినిమాలో తీసుకోవాలనుకుంటున్నారు. బాలయ్య సినిమాలో కీలకపాత్ర కోసం ఆమెని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. అలానే ‘క్రాక్’ సినిమాలో నటించిన కొందరు తారలు ఈ సినిమాలో కూడా కనిపిస్తారట.

వీరితో పాటు ‘క్రాక్’ సినిమాకి పనిచేసిన కొందరు టెక్నీషియన్స్ ను కూడా గోపీచంద్ మలినేని రిపీట్ చేయబోతున్నారు. ఇప్పటికే థమన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా అనౌన్స్ చేశారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus