వెంకటేష్, రానా కలయికలో మల్టీ స్టారర్ సినిమా!
- July 27, 2017 / 11:47 AM ISTByFilmy Focus
తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీ స్టారర్ సినిమాలు చేయడంలో ముందున్న హీరో విక్టరీ వెంకటేష్. మహేష్ బాబుతో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పవన్ కళ్యాణ్ తో గోపాలా.. గోపాలా సినిమాలు చేశారు. యువ హీరో రామ్ తో కలిసి నటించడానికి కూడా వెనుకాడలేదు. వారి కాంబినేషన్లో వచ్చిన మసాలా మూవీ హాస్యాన్ని పంచింది. అలాగే కమల్ హాసన్ తో కలిసి “ఈనాడు” వంటి ప్రయోగాత్మక చిత్రాన్ని చేశారు. ఇప్పుడు మరో మల్టీస్టారర్ల సినిమా చేయబోతున్నట్లు ఫిల్మ్ నగర్ వాసులు చెబుతున్నారు.
గురు సినిమా తర్వాత అనేక కథలు విన్న వెంకటేష్ .. ఏ కథకు ఒకే చెప్పలేదు. కారణం ఏమిటని ఆరా తీయగా.. తన అన్నసురేష్ కొడుకు రానాతో కలిసి సినిమా చేయాలనీ భావిస్తున్నారంట. రానా మొన్నటి వరకు “నేనే రాజు నేనే మంత్రి” సినిమా బిజీలో ఉన్నారు. ఈ మూవీ ఆగస్టు 11 న రిలీజ్ కానుంది. దీని తర్వాత బాబాయ్ తో కలిసి రానా కథ చర్చల్లో పాల్గొననున్నట్లు తెలిసింది. స్టోరీ ఫైనల్ కాగానే వెంటనే సెట్స్ మీదకు వెళ్ళిపోనుంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మితం కానున్న మల్టీ స్టారర్ మూవీ గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















