సూపర్ స్టార్ కృష్ణ సతీమణి కి అరుదైన గౌరవం
- May 11, 2017 / 06:08 AM ISTByFilmy Focus
సూపర్స్టార్ హీరో కృష్ణ సతీమణి, సీనియర్ దర్శకురాలు, సినీ నటి విజయనిర్మలకు అరుదైన గౌరవం లభించింది. నటిగా తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా అనేక సినిమాలు చేసిన ఆమె, దర్శకురాలిగా మారి ‘ప్రజల మనిషి, హేమా హేమీలు, బెజవాడ బెబ్బులి’ వంటి పలు హిట్ చిత్రాలు తీసి భారతదేశంలోనే అత్యధిక సినిమాలను డైరెక్ట్ చేసిన దర్శకురాలిగా గిన్నిసుబుక్లో ఎక్కారు. సినీ పరిశ్రమకు అందించిన సేవలకు గుర్తింపుగా మన ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డు తో సత్కరించింది. ఇప్పుడు ఆమె కిరీటంలో మరో కలికితురాయి చేరింది.
యూకే కు చెందిన రాయల్ అకాడమీ ఆఫ్ గ్లోబల్ పీస్ ఆమెకు గౌరవ డాక్టరేట్ ను ప్రకటించింది. విదేశీ విద్య సంస్థ నుంచి ఈ అవార్డు అందుకున్న తెలుగు తొలి మహిళగా విజయ నిర్మల రికార్డుల్లోకి ఎక్కారు. దీంతో విజయ నిర్మల తనయుడు నరేష్ ఆనందం వ్యక్తం చేశారు. కృష్ణ తన భార్య విజయ నిర్మలకు శుభాకాంక్షలు తెలిపారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















