Virosh: విరోష్ వెడ్డింగ్.. ఆ పెళ్లి వేదిక స్పెషాలిటీ తెలుసా? రేటు చూస్తే షాకే!
- February 25, 2026 / 12:38 PM ISTByFilmy Focus Desk
విజయ్ దేవరకొండ – రష్మిక మందన పెళ్లి ఫిబ్రవరి 26న ఉదయ్పుర్ వేదికగా పెళ్లి జరగనుంది. ఈ వేడుకలు రాజస్థాన్లో ఉదయ్పూర్లో ఉన్న ఐటీసీ మెమెంటోస్లో ఘనంగా మొదలయ్యాయి. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పెళ్లి వేడుకలకు ముందు విజయ్ ఓ ఫొటోను షేర్ చేసుకున్నారు. స్విమ్మింగ్ పూల్ ఫొటోను విజయ్ షేర్ చేయగా, డైనింగ్ టేబుల్పై గ్రీన్ థీమ్తో ఉన్న డిన్నర్ మెనూ ఫొటోను రష్మిక షేర్ చేసింది. దానిపై విరోష్ అని రాసి ఉంది.
Virosh
మంగళవారం నాడు సంగీత్, మెహందీ వేడుకలు, బుధవారం హల్దీ కార్యక్రమం, ఫిబ్రవరి 26న వివాహం జరగనున్నట్లు సమాచారం. ఈ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన 100 మాత్రమే హాజరవుతున్నారని సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఈ వేడుకలకు వేదికైన ఐటీసీ మెమెంటోస్ గురించి ఆసక్తికర విషయాలు అంటూ కొన్ని వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉదయపూర్ నగరానికి 25 కిలో మీటర్ల దూరంలో ఆరావళి పర్వత శ్రేణుల మధ్య ఎత్తైన కొండలు, పచ్చని ప్రకృతి నడుమ ఈ వేదిక ఉంది.

ఐటీసీ మెమెంటోస్లో మొత్తం 117 విల్లాలు ఉన్నాయి. విల్లా నుండి చూస్తే చుట్టూ ప్రకృతి, అందమైన కొండలు, ప్రకృతి కనువిందు చేస్తాయి. అందుకే సెలబ్రిటీలు చాలా వరకు ఈ హోటల్ను ఎక్కువగా ఎంచుకుంటూ ఉంటారు. ఈ రిసార్ట్కు భారీగా డిమాండ్ ఉంటుంది. ఏప్రిల్ వరకూ బుకింగ్స్ ఫుల్ అయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ రిసార్ట్లో వ్యాలీ వ్యూ విల్లా, లేక్ వ్యూ విల్లా, ప్రీమియం విల్లా, అరావళి సూట్, మెమెంటోస్ సూట్, ప్రెసిడెన్షియల్, గ్రాండ్ ప్రెసిడెన్షియల్ సూట్స్ ఉంటాయి.
ఈ రిసార్ట్కు వచ్చే అతిథులకు రాచమర్యాదలు చేస్తారు. ఉదయ్ పెవిలియన్, కబాబ్స్, కర్రీస్, రాయల్ వేగా, ది రాక్ బార్ వంటి రెస్టరంట్లలో భారతీయ రుచులతో పాటు, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన విదేశీ వంటకాలను వడ్డిస్తారు. వీటితోపాటు ఫిట్నెస్ సెంటర్, జిమ్ వంటివి ఎలానూ ఉంటాయి.
















