ఒకే రోజు అయిదు చిన్న సినిమాలు
- February 20, 2016 / 11:11 AM ISTByFilmy Focus
ఈ ఏడాది ఆరంభంలోనే సంక్రాంతి కానుకగా నాలుగు పెద్ద సినిమాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఎదురైనా చివరికి నాలుగు సినిమాలు హిట్ టాక్ తో మంచి కలెక్షన్స్ సాధించాయి. తాజాగా అయిదు చిన్న సినిమాలు ఒకే రోజున విడుదలై పోటీపడనున్నాయి. మార్చి 4వ తేదీన ఈ అయిదు సినిమాలు విడుదల తేదీని ఇప్పటికే ప్రకటించి పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్నాయి. అందులో మొదట దశరథ్ దర్శకత్వంలో మంచు మనోజ్, రెజినా జంటగా నటించిన ‘శౌర్య’ చిత్రం ఒక డిఫరెంట్ లవ్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
‘అలా మొదలైంది’ చిత్ర దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో నాగశౌర్య, మాళవిక జంటగా నటించిన ‘కళ్యాణ వైభోగమే.., అడవి శేషు, అదాశర్మ, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన ‘క్షణం’ చిత్రం.., ఇక చాలాకాలం తర్వాత మరోసారి శ్రీకాంత్ హీరోగా ‘టెర్రర్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరోపక్క రాయ్ లక్ష్మి మరియు తమిళ నటుడు శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ డబ్బింగ్ చిత్రం ‘శివగంగ’ చిత్రాలు మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
అయితే వేసవిలో స్టార్ హీరోల సినిమాలు విడుదలకి సిద్దమవుతుండటంతో మార్చి నెలలోనే ఎలాగైనా సినిమాలను విడుదల చేయాలనీ ఈ చిన్న సినిమా నిర్మాతలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే మార్చి 4న విడుదల తేదీని ప్రకటించిన చివరి క్షణం వరకు ఏ సినిమాలు విడుదల అవుతాయో.. ఏ చిత్రాలు వాయిదా వేసుకుంటాయో వేచిచూడాల్సిందే.!!
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus












