అఖిల్, విక్రమ్ కుమార్ సినిమాకి ప్రచారంలో కొత్త టైటిల్
- August 10, 2017 / 09:19 AM ISTByFilmy Focus
అఖిల్ సినిమా అఖిల్ కి విజయాన్ని అందించలేకపోయింది. తొలి సినిమా నిరాశపరచడంతో రెండో సినిమాపై అఖిల్ బాగా దృష్టిపెట్టారు. అక్కినేని నాగార్జున కూడా ఈ చిత్రం పై శ్రద్ధ పెట్టారు. కథ దగ్గర నుంచి ఆర్టిస్టులు టెక్నీషియన్లు అన్ని విషయాల్లో ఒకటికి రెండు సార్లు అలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. అక్కినేని కుటుంబానికి మనం వంటి క్లాసిక్ చిత్రాన్ని అందించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ రెండో చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీ మొదటి షెడ్యూల్ కోసం నిర్మాత నాగార్జున 12 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రస్తుతం రెండో షెడ్యూల్ జరుగుతోంది.
ఇంకా హీరోయిన్ ఖరారు కానీ మూవీ టైటిల్ కి ఇది వరకు “జున్ను”, “ఎక్కడ ఎక్కడ ఉందో తారక” అనే రెండు పేర్లు అనుకున్నారు. అంతేకాదు అఖిల్ తల్లిదండ్రులు నాగార్జున, అమల జంటగా నటించిన ‘నిర్ణయం’లోని ‘హలో గురు ప్రేమ కోసమే’ పాటనే పేరు కూడా పరిశీలించారు. తాజగా ఈ సినిమాకి ‘రంగుల రాట్నం’ అనే పేరుని ఫిక్స్ చేసినట్లు తెలిసింది. ఇది ఎంత వరకు నిజమో కొన్ని రోజుల్లో తెలియనుంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లలో నాగార్జున భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















