ద‌ర్శ‌క నిర్మాత‌గా మారిన న‌టి క‌ల్యాణి..!

  • March 9, 2020 / 12:44 PM IST

అనేక సూప‌ర్ హిట్ సినిమాల్లో నాయిక‌గా న‌టించి, తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను గెలుచుకున్న న‌టి క‌ల్యాణి తాజాగా ద‌ర్శ‌క నిర్మాత‌గా మారారు. ఇటీవ‌లి కాలంలో అతిథి పాత్ర‌ల్లో క‌నిపిస్తూ వ‌స్తున్న ఆమె కే2కే ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా విల‌క్ష‌ణ ప్రేమ‌క‌థ‌తో సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా క‌ల్యాణి తీస్తున్న ఈ సినిమా తెలుగు, త‌మిళ ద్విభాషా చిత్రంగా త‌యార‌వుతోంది. ఈ సినిమా ప్రి లుక్‌, టీజ‌ర్ గ్లింప్స్‌ను హోలీ ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా సోమ‌వారం డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఆవిష్క‌రించారు.

చేత‌న్ శీను, సిద్ది, సుహాసినీ మ‌ణిర‌త్నం, రోహిత్ ముర‌ళి, శ్వేత ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ధారులు. త్వ‌ర‌లోనే ఈ సినిమా షూటింగ్ మొద‌లు కానున్న‌ది. బాల‌న‌టిగా కెరీర్ ఆరంభించిన క‌ల్యాణి, 1986 నుంచి సినిమాల్లో న‌టిస్తూ వ‌స్తున్నారు. త‌న‌కున్న విస్తృతానుభ‌వంతో ఒక‌వైపు నిర్మాత‌గా మారుతూనే మ‌రోవైపు ద‌ర్శ‌క‌త్వాన్నీ చేప‌ట్టారు.

Most Recommended Video

పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus