Mokshagnya: మోక్షజ్ఞ డెబ్యూ.. మళ్ళీ మొదటికొచ్చిన సమస్య!
- December 17, 2024 / 10:00 PM ISTByFilmy Focus Desk
నందమూరి బాలకృష్ణ (Balakrishna) తనయుడు మోక్షజ్ఞ (Nandamuri Mokshagnya) ఎంట్రీ గురించి ఇప్పటి వరకు ఎన్నో వార్తలు వినిపించాయి. అభిమానులు ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు దర్శకుడు ప్రశాంత్ వర్మతో (Prasanth Varma) లాంచ్ అవుతుందనే వార్త వచ్చినప్పుడు, ఒకింత ఊరట కలిగింది. కానీ అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయినట్టు ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. బాలకృష్ణ మాత్రం మోక్షజ్ఞ ఆరోగ్యం కారణంగా షూటింగ్ వాయిదా వేసుకున్నామని చెప్పినప్పటికీ, ఇండస్ట్రీలోని సమాచారం ప్రకారం, కంటెంట్ విషయంలో విభేదాలు ప్రధాన కారణమని చెబుతున్నారు.
Mokshagnya

ఇక లేటెస్ట్ గా మోక్షజ్ఞ డెబ్యూ ప్రాజెక్ట్ పై మరోసారి చర్చల మూడ్లోకి వెళ్లినట్టు సమాచారం. బాలకృష్ణ ఇప్పుడు మరొక రెండు కథలను పరిశీలిస్తున్నట్లు టాక్. ఒకటి కల్కి ఫేమ్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) (Nag Ashwin) దర్శకత్వంలో, మరొకటి వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఉంటుందని అంటున్నారు. అయితే ఇందులో ఏ ప్రాజెక్ట్ ముందుగా సెట్స్పైకి వెళ్లుతుందనేది మాత్రం ఇంకా స్పష్టత లేదు.

నాగ్ అశ్విన్ ఇప్పటికే తన ‘కల్కి 2898 ఏ.డి పార్ట్ 2’ (Kalki 2898 AD) పనుల్లో బిజీగా ఉన్నారు. ఇది భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో 2026 వరకు ఆయన పూర్తిగా ఫోకస్ అక్కడే ఉంటుంది. అయినా, ఆయన స్టోరీలైన్లకు ఉన్న ప్రాధాన్యత చూసి, అభిమానులు మోక్షజ్ఞ డెబ్యూకి ఆయన దర్శకత్వం సరైన నిర్ణయం అవుతుందని ఆశిస్తున్నారు. మరోవైపు వెంకీ అట్లూరి “లక్కీ భాస్కర్” (Lucky Baskhar) పూర్తయ్యాక కొత్త ప్రాజెక్ట్ కోసం సిద్ధంగా ఉన్నారు.

వెంకీ సాఫ్ట్ ఎమోషనల్ కథలు మంచి విజయాన్ని అందించిన నేపథ్యంలో మోక్షజ్ఞ (Mokshagnya) ఎంట్రీని ప్రామిసింగ్గా మార్చగలరని భావిస్తున్నారు. అంతేకాదు, బాలకృష్ణ తన ఆదిత్య 369 సీక్వెల్ గా “ఆదిత్య 999” సినిమాను మోక్షజ్ఞతోనే చేయాలని భావిస్తున్నట్టు గతంలో ప్రకటించారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ కేవలం ప్లానింగ్ స్టేజ్లోనే ఉండిపోయింది. ఫలితంగా మోక్షజ్ఞ ఎంట్రీ మరోసారి మౌలికంగా మొదటికి వచ్చిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఎంతకాలం సాగుతుందనేది బాలకృష్ణ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది.

















