బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Sreenivas) హీరోగా మంచు మనోజ్ (Manchu Manoj) , నారా రోహిత్ (Nara Rohith) కాంబినేషన్లో ‘భైరవం’ (Bhairavam) వచ్చింది. విజయ్ కనకమేడల (Vijay Kanakamedala) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘శ్రీ సత్య సాయి ఆర్ట్స్’ బ్యానర్ పై కె.కె.రాధామోహన్ (K. K. Radhamohan) నిర్మించారు. మే 30 న రిలీజ్ అయిన ఈ సినిమాకి తొలి రోజు మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ సో సోగానే వచ్చాయి సాధించింది ఈ సినిమా. 4వ రోజు అంటే సోమవారం నాడు కలెక్షన్స్ తగ్గాయి. మాస్ ఏరియాల్లో ఈ సినిమా బాగానే కలెక్ట్ చేస్తుంది.
కానీ మిగిలిన ఏరియాల్లో అనుకున్న స్థాయిలో కలెక్ట్ చేయడం లేదు. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 2.00 cr |
సీడెడ్ | 0.63 cr |
ఆంధ్ర(టోటల్) | 2.11 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 4.74 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.30 cr |
ఓవర్సీస్ | 0.40 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 5.44 cr |
‘భైరవం’ చిత్రానికి రూ.15 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది . ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కొరకు రూ.15.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. 4 రోజుల్లో ఈ సినిమా రూ.5.44 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.9.2 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ సినిమా మరో రూ.10.06 కోట్ల షేర్ ను రాబట్టాలి. వీక్ డేస్ లో కూడా నిలకడగా రాణించి రెండో వీకెండ్ పుంజుకుంటే తప్ప ఈవెన్ సాధించడం కష్టంగానే కనిపిస్తుంది.