నిన్న సీనియర్ స్టార్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి (S. V. Krishna Reddy) పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తీసిన సినిమాల ద్వారా స్టార్స్ అయిన వాళ్లంతా ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ క్రమంలో రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) స్పీచ్ ఇవ్వాల్సి వచ్చింది. ఈ క్రమంలో రాజేంద్ర ప్రసాద్ కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించారు. ‘ఈ వేడుకకు ఇంతమంది వస్తారనే విషయం నాకు ముందు చెప్పలేదు… నీ సంగతి బయటకు వెళ్ళాక చెప్తా.!’
అంటూ నిర్మాత అచ్చిరెడ్డి, తర్వాత ‘ఏరా అలీగా (Ali).. ఏడి ఎక్కడ ల*జ కొడకా’ అంటూ అలీనీ…, అటు తర్వాత ఎన్టీఆర్ పురస్కారాన్ని అందించారని క్లాప్స్ కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్టు అని మురళీ మోహన్ ను(Murali Mohan), ఆ తర్వాత రోజాని (Roja Selvamani) ‘ఏమే నిన్ను కూడా నేనే హీరోయిన్ని చేశాను కదా’ అంటూ నోటికి ఎంతొస్తే అంత మాట్లాడారు రాజేంద్రప్రసాద్. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రాజేంద్ర ప్రసాద్.. ఇలా నోరు జారడం ఇది మొదటిసారి కాదు.
మొన్నటికి మొన్న ‘రాబిన్ హుడ్’ (Robinhood) సినిమా ప్రమోషన్స్ లో కూడా వార్నర్ ను.. ‘దొంగ ము*డా కొడుకు’ అంటూ అప్పుడు కూడా నోరు జారారు. ట్రోల్ అయ్యారు. ఇప్పుడు మరోసారి ఈ వివాదంతో హాట్ టాపిక్ అయ్యారు. దీనిపై రాజేంద్ర ప్రసాద్ ‘షష్టిపూర్తి’ (Shashtipoorthi) సక్సెస్ మీట్లో క్లారిటీ ఇచ్చారు. ‘నేను అందరితోనూ సరదాగా ఉంటాను.. అది మీకు తప్పుగా అనిపిస్తే మీ కర్మ’ అంటూ తోసిపుచ్చారు. మరోవైపు ఇదే అంశంపై కమెడియన్ అలీ స్పందించడం జరిగింది.
‘పాపం ఆయన కూతురు పోయిన బాధలో ఉన్నారు.. ఓ మాట తూలారు. దయచేసి దీన్ని భూతద్దంలో పెట్టుకుని చూడకండి. ఆయన చాలా గొప్ప ఆర్టిస్ట్’ అంటూ తెలిపారు అలీ. అందరితోనూ సరదాగా ఉండటం అనేది చాలా మంచిది. కానీ ఏది ఎక్కడ చేస్తే అంత మంచిది. పబ్లిక్ ఈవెంట్లో ఉన్నప్పుడు ఎంత పద్దతిగా, కంట్రోల్డ్ గా ఉంటే అంత మంచిది. ఈ విషయం రాజేంద్రప్రసాద్ కి తెలియనిది కాదు. కానీ ఈ మధ్య చాదస్తంతో వ్యవహరిస్తున్నారు అంతే..!