కథానాయిక సమంత (Samantha), దర్శకనిర్మాత రాజ్ నిడిమోరు మధ్య ఏం నడుస్తోంది? ఈ ప్రశ్న చాలా రోజులుగా వినిపిస్తూనే ఉంది. ఈ ప్రశ్నలు వినిపిస్తున్న సమయంలోనే వినిపిస్తున్న మరో ప్రశ్న ‘రాజ్ నిడిమోరు భార్య శ్యామాలి పోస్టుల వెనుక అర్థమేంటి?’ అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఆమె టైమ్ చూసి ఆ పోస్టులు పెడుతున్నారా? లేక రెండు విషయాలకు ఆటోమేటిక్గా సింక్ అవుతోందా అనేది అర్థం కావడం లేదు. సమంత – రాజ్ నిడిమోరు పికిల్ బాల్ ఆడిన విషయం బయటకు రాగానే.. శ్యామాలి ఓ పోస్ట్ పెట్టారు. రెండూ కనెక్టింగ్గా ఉండటం గమనార్హం.
శ్యామాలి ఇటీవల వరుసగా సందేశాత్మక ఇన్స్టాగ్రామ్ పోస్టులతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా కర్మ సిద్ధాంతం గురించి ఓ పోస్టు పెట్టారు. ‘కాలం అన్నింటినీ బయటపెడుతుంది’ అనేది ఆమె పోస్టు సంక్షిప్త సారాంశం. ‘కాలం అన్నింటినీ బయటపెడుతుంది.. కర్మ సమాధానం చెబుతుంది. ఈ ప్రపంచం నిశితంగా చూస్తుంటుంది’’ అంటూ ఆమె ఇన్స్టా స్టోరీస్లో రాసుకొచ్చారు. దాంతోపాటు కర్మ, నువ్వు ఏం ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది అని రాశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
శ్యామాలి స్టోరీ వెనుక కారణం ఏమై ఉంటుందా అని నెటిజన్లు వెతుకులాట మొదలుపెట్టారు. అయితే దానికి కాసేపటి ముందే సమంత, రాజ్ కలసి పికిల్ బాల్ ఆడిన ఫొటో ఒకటి కనిపించింది. ఆ విషయం గురించే శ్యామాలి ఈ పోస్టు పెట్టి ఉండొచ్చు అని అంటున్నారు. సామ్ – రాజ్ రిలేషన్లో ఉన్నారు అంటూ గత కొన్ని రోజులుగా పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. అప్పటి నుండే శ్యామాలి సోషల్ మీడియా పోస్టులపై చర్చ మొదలైంది.
2015లో రాజ్ నిడిమోరుతో శ్యామాలి వివాహం జరిగింది. రాజ్ చిత్రాలకు ఆమె క్యాస్టింగ్లో సాయం చేస్తుండేవారు. అయితే ఇద్దరూ విడిపోతున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే ఈ విషయంలో ఇద్దరూ స్పందించలేదు. ఇటువైపు సమంత నుండి అదే పరిస్థితి. ఇలాంటి విషయంలో సమంత త్వరగా రియాక్ట్ అవుతూ ఉంటుంది. మరి శ్యామాలి విషయంలో ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదో?