పోలీసులను ఆశ్రయించిన దిల్ రాజు, కళ్యాణ్ రామ్
- June 28, 2017 / 01:52 PM ISTByFilmy Focus
పైరసీ, లీకు రాయుళ్ల పని పట్టేందుకు టాలీవుడ్ నిర్మాతలు ముందుకు కదిలారు. గత శుక్రవారం ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాను పైరసీ చేసి ఫేస్బుక్, యూట్యూబ్ లో కొంతమంది అప్లోడ్ చేసారు. ఆ పని చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆ చిత్ర నిర్మాత దిల్రాజు, దర్శకుడు హరీష్ శంకర్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ రోజు ఫిర్యాదు చేశారు. పైరసీని నిర్మూలించేందుకు ఎలాంటి తీసుకోవాలనే అంశంపై సీసీఎస్సైబర్ క్రైమ్ అసిస్టెంట్ కమిషనర్ రఘువీర్తో చర్చించారు. అనంతరం మాట్లాడుతూ పైరసీతో సినిమా ఇండస్ట్రీ నష్టాల్లోకి పోయే ప్రమాదం ఉందని, పైరసీని అరికట్టి, సినిమా ఇండస్ట్రీని కాపాడాలని దిల్ రాజు కోరారు.
ఇక నిర్మాణ దశలో ఉన్న జై లవకుశ సినిమా వీడియో లీకేజ్ కావడంపై చిత్ర నిర్మాత కళ్యాణ్ రామ్ వెంటనే స్పందించారు. లీకేజ్ చేసిన వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రెండు కేసులను సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అనుమానితులను పట్టుకొని ప్రశ్నిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















