తనపై వస్తున్న వార్తలను ఖండించిన గోపిచంద్ మలినేని!

  • July 14, 2018 / 05:38 AM IST

ఇతర హీరోలు వరుసగా విజయాలను అందుకుంటూ పోతుంటే మెగా హీరో మాత్రం అపజయాలను మూటగట్టుకుంటున్నారు. తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటిలిజెంట్, తేజ్.. ఐలవ్ యూ… ఇలా వరుసగా ప్లాప్ లతో రికార్డు సృష్టించారు. ఈ సారి మాత్రం విజయం అందుకోవాలని తపిస్తున్నారు. నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో సినిమా చేయడానికి తేజు సిద్ధమవుతున్నారు. అలాగే సాయి ధరమ్ తేజ్..  గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మళ్ళీ నటించబోతున్నారు. గతంలో ఈ కాంబినేషనలో వచ్చిన విన్నర్ ఆశించినంత విజయం సాధించలేదు. అందుకే ఈసారి మంచి హిట్ ఇవ్వడానికి గోపిచంద్ రెడీ అవుతున్నారు.

ఆ స్క్రిప్ట్ పనుల్లోనే బిజీగా ఉన్నారు. అయితే సాయి ధరమ్ తేజ్ గోపిచంద్ తో సినిమాని పక్కన పెట్టారని, కిషోర్ తిరుమల తర్వాత కొత్త దర్శకుడు గోపాల్ తో మూవీ చేయనున్నారని వార్తలు షికారు చేస్తున్నాయి. విజయవాడ నేపథ్యంలో జరిగే ఈ కథకు “భగవద్గీత సాక్షిగా..” అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఇక గోపిచంద్ తో తేజు సినిమా లేనట్టే అని కొన్ని వార్త సంస్థలు కథనాలను ప్రచురించాయి. దీనిపై డైరక్టర్ స్పందించారు. ఈ వార్తలు అవాస్తవమని స్పష్టంచేశారు. సాయి ధరమ్ తేజ్ తో సినిమా తప్పకుండా ఉందని, ఆ వివరాలను త్వరలోనే ప్రకటిస్తానని వెల్లడించారు. మరి ఈసారైనా ఈ కాంబో హిట్ కొడుతుందేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus