Mrunal Thakur: అంతా ఓకే అయింది అన్నారే.. మృణాల్ ఠాకూర్ ఇలా అంటోంది ఏంటి?
- February 5, 2026 / 12:27 PM ISTByFilmy Focus Desk
అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. AA22 అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ సినిమా గురించి టీమ్ అఫీషియల్గా చాలా తక్కువ విషయాలే చెప్పింది. అయితే సినిమా సన్నిహితులు అంటూ కొంతమంది చాలా విషయాలు చెప్పేస్తున్నారు. అందులో ఏవి నిజాలు, ఏవి కావు అనేది చాలా రోజులుగా తేలడం లేదు. ఇందులో ఓ విషయంలో ఇప్పుడు స్పష్టత వచ్చింది. ఇచ్చిందేమో కథానాయిక మృణాల్ ఠాకూర్.
Mrunal Thakur
అట్లీ – బన్నీ సినిమాలో నలుగురు లేదా ఐదుగురు హీరోయిన్లు అని చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. అందులో ఓ కథానాయికను మాత్రమే అధికారికంగా ప్రకటించారు. అయితే వార్తల్లో మాత్రం మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ అంటూ రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. అందరూ స్టార్ హీరోయిన్లు కావడంతో ఈ సినిమా విషయంలో ఆసక్తి పెరుగుతూ వస్తోంది. వీరితోపాటు యువ హీరోయిన్లు కూడా నటిస్తారని చెబుతున్నారు.

అయితే, ఇప్పుడు మృణాల్ ఠాకూర్ చెప్పేది వింటే ‘ఇదేంటి అంతా ఓకే అన్నారు.. మల్లు అర్జున్ సరసన మృణాల్ అన్నారు.. ఆమె కాదంటోందేంటి?’ అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన సినిమాలో హీరోయిన్ల విషయంలో ఇంకా లెక్క తేలలేదు అని అర్థమవుతోంది. ఇప్పటివరకు అయితే దీపికా పడుకొణె ఒక్కరే ఫిక్స్. అసలు మృణాల్ ఏమంది అనేదేగా డౌట్.
‘‘నేను హీరోయిన్గా ఆ సినిమా తెరకెక్కిస్తున్నారా.. ఇది నిజంగా జరగాలని మీరూ ప్రార్థించండి. అనుకున్నట్లుగా జరిగితే మళ్లీ మనం మరో ఇంటర్వ్యూలో ఆ సినిమా గురించి మాట్లాడదాం’’ అని అంది. అంటే ఆమె నటించడం లేదు అనేదేగా. అయితే ఇలా చెప్పి తర్వాత నటిస్తున్నా అని ట్విస్ట్ ఇవ్వదు కదా అనే డౌట్ కూడా ఉందనుకోండి. ఇక ఈ సినిమాకు సంబంధించి నెక్స్ట్ అప్డేట్ అంటే ఏప్రిల్ 8నే వస్తుంది అని చెప్పొచ్చు. ఆ రోజు అల్లు అర్జున్ జన్మదినం సందర్భంగా స్పెషల్ వీడియో / పోస్టర్ తప్పక వస్తుంది.















