మోసం చేసిన బిల్డర్ పై జగపతి బాబు ఫైర్
- August 19, 2017 / 01:30 PM ISTByFilmy Focus
మోసం చేసిన బిల్డర్ పై జగపతి బాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కొత్త సినిమాలో పాత్ర అని తేలికగా తీసుకోకండి. నిజంగానే జగ్గూభాయ్ కోపంతో రగిలిపోతున్నారు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో లోధా అపార్ట్ మెంట్స్ బిల్డర్ లోధా గేటెడ్ కమ్యూనిటీ, హై ఎండ్ అపార్ట్ మెంట్స్ పేరుతో జగపతి బాబు నుంచి 4 కోట్లు తీసుకున్నారంట. అయితే గేటెడ్ కమ్యూనిటీ లో ఇల్లు ఇవ్వకుండా అపార్ట్మెంట్స్ లో ఇస్తానని ప్లేట్ మార్చడంట. ఈ మోసంపై జగపతి బాబు మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “లోధా అపార్ట్ మెంట్స్ బిల్డర్.. లోధా గేటెడ్ కమ్యూనిటీ, హై ఎండ్ అపార్ట్ మెంట్స్ పేరుతో నా నుంచి 4 కోట్లు తీసుకున్నాడు. ఇప్పుడు పక్కనే ఉన్న అపార్ట్మెంట్లను కలపుతామని చెబుతున్నాడు. బిల్డర్ తనకి నచ్చినట్టు చేయడానికా.. మేము అన్ని కోట్లు ఇచ్చింది” అంటూ జగపతి ప్రశ్నించారు.
సుమారు 7,000 మంది అక్కడ ఉంటున్నారని, వారంతా బిల్డర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని, అపార్ట్మెంట్లను గేటెడ్ కమ్యూనిటీలో కలిపితే రక్షణ ఉంటుందా? అని గట్టిగా అడిగారు. ” ప్రశాంతత కోసమే ఎవరైనా గేటెడ్ కమ్యూనిటీని కోరుకుంటారు, అలాంటిది లోధా అపార్ట్ మెంట్స్ లో ఉంటుందా? అని అంతా ఆందోళన చెందుతున్నారని వివరించారు. “బిల్డర్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలి, కుదరదు అంటే .. ఏం చేయాలో, ఎలా చేయాలో కూడా నాకు తెలుసు” అని జగపతిబాబు హెచ్చరించారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.












