‘కన్నప్ప’ (kannappa) సినిమా ఎప్పుడొస్తుందా? ఎప్పుడు చూస్తామా? అని టాలీవుడ్ ప్రేక్షకులే కాదు దేశం మొత్తం ఎదురుచూస్తోంది. సినిమా మీద తొలుత చాలా వ్యతిరేకత ఉన్నా.. తర్వాతర్వాత వచ్చిన ప్రచార కంటెంట్తో ప్రేక్షకుల్లో మార్పు కనిపించింది. అయితే ఎక్కడో సినిమా మీద కాస్త నెగిటివిటీ కనిపిస్తోంది. పనిలో పనిగా సినిమాలో కీలక సభ్యులు అయిన మంచు విష్ణు (Manchu Vishnu), మోహన్బాబు (Mohan Babu) మీద కూడా సోషల్ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి.
దీంతో ఈ విషయంలో ‘కన్నప్ప’ (kannappa) టీమ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మంచు విష్ణు () ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కన్నప్ప’. మరో రెండు రోజుల్లో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా, అందులోని భాగస్థుల పరువుకు నష్టం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని గట్టిగా హెచ్చరించింది. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా తమ సినిమా విడుదల కానుందని, అప్పుడు ఎవరైనా కించపరిస్తే చర్యలు తీసుకుంటామని టీమ్ స్పష్టం చేసింది.
పెద్ద ఎత్తున కృషి, భారీ బడ్జెట్తో అద్భుతంగా రూపొందిన చిత్రం ‘కన్నప్ప’ (kannappa). అన్నిరకాల అనుమతులతో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. విమర్శకులందరూ ముందుగా ఈ చిత్రాన్ని చూశారు. అందులోని సారాంశాన్ని అర్థం చేసుకొని, ఎలాంటి పక్షపాతాలకు లొంగకుండా మీ అభిప్రాయాలను చెప్పగలరు. భారత రాజ్యాంగంలోని వాక్ స్వాతంత్రాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను మేము గౌరవిస్తాం. అయితే సినిమాను కించపరిచేలా వ్యవహరిస్తే సహించం.
అలాంటి పనులు, వ్యాఖ్యలు చేసేవారిపై తప్పకుండా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అలాగే ‘కన్నప్ప’ (kannappa) సినిమాకు చెందిన ఇద్దరు కీలక భాగస్వాములు అయిన మోహన్బాబు (Mohan Babu), మంచు విష్ణు (Manchu Vishnu) వ్యక్తిత్వానికి సంబంధించి ఇప్పటికే దిల్లీ హైకోర్టు రక్షణ కల్పిస్తుందనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. వారి ఇమేజ్కి భంగం కలిగించేలా ఎవరైనా మాట్లాడితే చట్టపరమైన చర్యలకు సిద్ధమవ్వాల్సిందే. గతంలో జరిగిన అవాంతరాలు, పరిస్థితుల కారణంగానే ముందుగా హెచ్చరిస్తున్నామని కన్నప్ప (kannappa) టీమ్ తెలిపింది.