తనపై వచ్చిన వార్తలను ఖండించిన లావణ్య త్రిపాఠి!

  • November 1, 2017 / 10:21 AM IST

“భలే భలే మగాడివోయ్”, “సోగ్గాడే చిన్ని నాయనా”, “శ్రీరస్తు శుభమస్తు” సినిమాలతో మహిళా అభిమానులను అధికంగా సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి తాజాగా ఉన్నదీ ఒకటే జిందగీ చిత్రం ద్వారా  మరో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయాన్ని ఆస్వాదించే లోపే లావణ్యను ఓ వార్త తెగ ఇబ్బంది పెడుతోంది. అదేమిటంటే.. లావణ్య త్రిపాఠికి కోలీవుడ్‌ నిర్మాతల సంఘం 3 కోట్ల జరిమానా విధించారంట.   ఎందుకంటే.. “తెలుగులో వచ్చిన “100%లవ్‌” చిత్రాన్ని తమిళంలో ‘100% కాదల్‌’గా రీమేక్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలో జి.వి. ప్రకాశ్‌ హీరోగా నటిస్తున్నారు. హీరోయిన్ గా మొదట లావణ్య త్రిపాఠిని ఎంపిక చేసుకున్నారు. షూటింగ్ సమయానికి లావణ్య సినిమా నుంచి తప్పుకొంది. దాంతో అప్పటికప్పుడు చిత్రీకరణను నిలిపివేయాల్సి వచ్చింది.

లావణ్య తప్పుకోవడం వల్ల నిర్మాతకు 3 కోట్ల వరకు నష్టం జరిగిందని అక్కడి పరిశ్రమ పెద్దలకు చెప్పుకోవడంతో వారు లావణ్యకు జరిమానా విధించినట్లు సమాచారం.” ఈ వార్త రెండు రోజులుగా తెగ చక్కర్లు కొట్టింది. దీనిపై లావణ్య స్పందించింది. ఈ వార్తలో నిజం లేదని స్పష్టం చేసింది. ఇటువంటి వార్తలు ఎవరు పుట్టిస్తారో, ఎందుకు ప్రచారం చేస్తారో తనకి అర్ధం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus