విజయ్ సేతుపతి (Vijay Sethupathi) విలన్ రోల్స్ తో విసిగిపోయి.. మళ్ళీ హీరోగా రాణించాలి అనే ప్రయత్నంలో భాగంగా చేసిన మూవీ ‘మహారాజా’ (Maharaja) . నిథిలన్ స్వామినాథన్ (Nithilan Saminathan) దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. గత ఏడాది జూన్ నెలలో రిలీజ్ అయ్యింది. విజయ్ సేతుపతి కెరీర్లో 50వ సినిమాగా రూపొందింది ‘మహారాజా’ (Maharaja).
పెద్దగా అంచనాలు లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో మంచి వసూళ్లు వచ్చాయి. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి వసూళ్లు రావడంతో బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు పైగా కలెక్ట్ చేసింది. కొన్ని నెలల తర్వాత చైనాలో రిలీజ్ అవ్వగా అక్కడ కూడా భారీ వసూళ్లు సాధించింది.
సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంటే.. స్క్రీన్ ప్లే అనే చెప్పాలి. 2 టైం లైన్స్ లో కథ జరుగుతూ ఉంటుంది.హీరో కూతురిపై అత్యాచారం చేసిన విలన్ గ్యాంగ్ పై హీరో రివేంజ్ తీర్చుకోవడమే ఈ సినిమా కథాంశం. అయితే క్లైమాక్స్ లో ఆమె తన కూతురే అని తెలుసుకుని విలన్ పశ్చాత్తాపంతో ప్రాణాలు విడవడం కూడా చాలా కన్విన్సింగ్ గా ఉంటుంది. సో ఈ సినిమాకి మంచి ఎండింగ్ ఇచ్చినట్టే..! సీక్వెల్ అవసరం లేదు.
కానీ చిత్ర బృందం సీక్వెల్ ప్లాన్ చేస్తోందట. దర్శకుడు నిథిలన్ ఐడియా కూడా డెవలప్ చేసుకున్నాడట. విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కనుక డేట్స్ ఇస్తే.. త్వరగా ‘మహారాజా 2’ (Maharaja 2) చేస్తానని నిథిలన్ (Nithilan Saminathan) తెలిపినట్టు సమాచారం. అయితే కల్ట్ స్టేటస్ కలిగి ఉన్న ‘మహారాజా’ (Maharaja) కి సీక్వెల్ అవసరమా? అనేది ఓ సెక్షన్ ఆఫ్ మీడియా వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళ అభిప్రాయం.