బాల భరత్ పై సన్నివేశాలను చిత్రీకరిస్తున్న కొరటాల!
- May 23, 2017 / 12:38 PM ISTByFilmy Focus
శ్రీమంతుడు తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న సినిమా “భరత్ అను నేను”. ఈ మూవీ షూటింగ్ సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. మహేష్ బాబు లేకుండా ఈ చిత్రీకరణ సాగుతోంది. జూబ్లీహిల్స్లోని ఓ భవంతి సెట్లో మహేశ్ పాత్ర చిన్నప్పటి సన్నివేశాలను మాస్టర్ జాయ్ పై తీస్తున్నారు. భరత్ తల్లిదండ్రుల పాత్రలను సితార, శరత్ కుమార్ పోషిస్తున్నారు. నాలుగు రోజుల పాటు ఈ సన్నివేశాలను చిత్రీకరిస్తారు. తర్వాత జూన్ 16 నుంచి రెండో షెడ్యూల్ జరగనుంది. ఆ షెడ్యూల్లో మహేష్ పాల్గొననున్నారు.
బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మహేష్ ఎన్నారై గా కనిపించనున్నారు. సినిమా క్లైమాక్స్ లో మహేష్ ముఖ్యమంత్రి అవుతారని తెలిసింది. భారీ బడ్జెట్ తో డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మహేష్, మురుగదాస్ కలయికలో తెరకెక్కుతోన్న మూవీ స్పైడర్ సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుండగా.. కొరటాల తో చేస్తున్న భరత్ అను నేను సంక్రాంతికి విడుదలకానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















