Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే
- February 18, 2026 / 05:36 PM ISTByPhani Kumar
విక్టరీ వెంకటేష్ హీరోగా కె.విజయ భాస్కర్ దర్శకత్వంలో ‘నువ్వు నాకు నచ్చావ్’ వంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ తర్వాత ‘మల్లీశ్వరి'(Malliswari) అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని డా.డి.రామానాయుడు సమర్పణలో ‘సురేష్ ప్రొడక్షన్స్’ సంస్థపై డి.సురేష్ బాబు నిర్మించారు. కోటి సంగీత దర్శకుడు. 2004 ఫిబ్రవరి 18న రిలీజ్ అయ్యింది ‘మల్లీశ్వరి’.
Malliswari
మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో పెళ్లికాని ప్రసాద్ గా వెంకటేష్ చేసిన కామెడీ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది.బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 22 ఏళ్ళు పూర్తి కావస్తున్న నేపథ్యంలో టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
| నైజాం | 4.05 cr |
| సీడెడ్ | 2.01 cr |
| ఉత్తరాంధ్ర | 1.31 cr |
| ఈస్ట్ | 1.01 cr |
| వెస్ట్ | 0.78 cr |
| గుంటూరు | 1.12 cr |
| కృష్ణా | 1.01 cr |
| నెల్లూరు | 0.68 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 11.97 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.53 Cr |
| వరల్డ్ వైడ్ (టోటల్) | 12.5 cr(షేర్) |
‘మల్లీశ్వరి’ సినిమా రూ.9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.12.51 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తంగా బయ్యర్స్ కి రూ.3.51 కోట్ల లాభాలు పంచి సూపర్ హిట్ అనిపించుకుంది. అన్ సీజన్లో రిలీజ్ అయినప్పటికీ ‘మల్లీశ్వరి’ ఈ స్థాయిలో కలెక్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు అనే చెప్పాలి.
ఆ ఫోన్ కాల్ నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది : జగపతి బాబు














