Manchu Lakshmi, Sai Dharam Tej: రూమర్స్పై మండిపడ్డ మంచు లక్ష్మి!
- September 11, 2021 / 06:48 PM ISTByFilmy Focus
ప్రముఖ సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదంలో గాయపడ్డ సంగతి తెలిసిందే. అభిమానులతో పాటు హీరో, హీరోయిన్లు, దర్శకనిర్మాతలు అందరూ కూడా సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్లు పెడుతున్నారు. అయితే సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురవ్వడంతో రకరకాల వార్తలు వస్తున్నాయి. అతి వేగం వలనే ప్రమాదం జరిగిందని అందరూ అంటున్నారు. బైక్ వేగం దాదాపు 180 కిమీ స్పెఏడుతో వెళ్తోందనే రూమర్లు వచ్చాయి.
సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే మాత్రం అంతటి వేగం లేనట్టు కనిపించింది. మామూలుగానే బండిని నడుపుతున్నట్లు అనిపించింది. అయితే ఈ ప్రమాదం జరిగిన తీరుపై వస్తోన్న రూమర్లను మంచు లక్ష్మీ తనదైన స్టైల్ లో కొట్టిపారేసింది. మంచు లక్ష్మీ మెగాహీరోలతో చాలా సన్నిహితంగా ఉంటుంది. తేజుని చూడడానికి హాస్పిటల్ వద్దకు చేరుకున్న మంచు లక్ష్మీ సోషల్ మీడియా వేదికగా తేజుపై వస్తోన్న పుకార్లను ఖండించింది. ”బాధ్యత కలిగిన పౌరుడిగా తేజ్ గురించి నాకు తెలుసు.

ఎక్కడా కూడా అతను మితిమీరిన వేగంతో వెళ్లినట్లు కనిపించడం లేదు. ఆ రోడ్డు మీదున్న మట్టి వలనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. దయచేసి రూమర్లను స్ప్రెడ్ చేయకండి. ప్రాణాపాయస్థితి నుండి తేజు బయటపడ్డాడు. ఇది మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం. ఆయన త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్ధించండి” అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు.
నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!












