Mohan Babu: ఎంతో ప్రేమగా అరేయ్ అని పిలిచేవారు.. కృష్ణంరాజు సంతాప సభలో మోహన్ బాబు ఎమోషనల్!

  • September 14, 2022 / 06:39 PM IST

టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్య సమస్యలతో ఆదివారం మరణించిన విషయం మనకు తెలిసిందే. ఆదివారం తెల్లవారుజామున మరణించిన కృష్ణంరాజు అంత్యక్రియలను సోమవారం తన ఫామ్ హౌస్ లో నిర్వహించారు. ఇకపోతే మంగళవారం ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ క్లబ్‌లో కృష్ణంరాజు సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంచు మోహన్ బాబు, విష్ణు, తమ్మారెడ్డి భరద్వాజ్, జీవిత, నిర్మాత సి కళ్యాణ్, కేఎల్ నారాయణ వంటి తదితరులు పాల్గొన్నారు.

ఇక ఈ సంతాప సభ కార్యక్రమంలో భాగంగా మంచు మోహన్ బాబు మాట్లాడుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.ఎంతోమంది ఆత్మీయులు అనంత లోకాలకు వెళ్లిన ఎప్పుడు ఇలాంటి సంతాప సభ కార్యక్రమంలో పాల్గొనేలేదు ఇదే మొదటిసారి అంటూ ఎమోషనల్ అయ్యారు. అదేవిధంగా కృష్ణంరాజుతో తనకున్న అనుబంధం గురించి కూడా గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రీలో తనని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా అరేయ్ అంటూ పిలిచేవారు.

అలాగే నన్ను మొదటిసారి బెంజ్ కారులో ఎక్కించినది కూడా కృష్ణంరాజు గారే అంటూ ఈ సందర్భంగా మోహన్ బాబు గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు. ఇక ఆయన నేడు మన మధ్య లేరని లోటు స్పష్టంగా కనబడుతుందని ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని సకల దేవతలను ప్రార్థిస్తున్నా అంటూ ఈ సందర్భంగా మోహన్ బాబు కృష్ణంరాజు సంతాప సభలో ఆయనతో తనకున్న అనుబంధం గురించి తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మంచు విష్ణు మాట్లాడుతూ నేను ఇలాంటి సభలో మాట్లాడుతానని ఎప్పుడూ అనుకోలేదు. మా ఎన్నికలలో అధ్యక్షత పదవికి పోటీ వద్దంటూ నాన్న వారించిన కృష్ణంరాజు గారు తనని పోటీ చేయమని చెప్పారంటూ ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. దాసరి గారి తర్వాత నేను అంతలా గౌరవించే వ్యక్తి కృష్ణంరాజు గారు అంటూ ఈ సందర్భంగా విష్ణు కృష్ణంరాజు గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus