మ్యూజిక్ డైరక్టర్ ప్రీతమ్ కి వరుసగా ఆఫర్లు
- February 16, 2017 / 01:39 PM ISTByFilmy Focus
తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయి పెరుగుతోంది. అందుకే హాలీవుడ్, బాలీవుడ్ టెక్నీషియన్లు టాలీవుడ్ లో పనిచేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ధూమ్, బర్ఫీ, జబ్ వుయ్ మెట్, ఒన్స్ అపానే టైం ఇన్ ముంబై, దిల్వాలే, దంగల్, యే దిల్ హై ముష్కిల్ వంటి సూపర్ హిట్ చిత్రాలకు సంగీతమందించిన ప్రీతమ్ తెలుగు చిత్రానికి మ్యూజిక్ ఇవ్వడానికి అంగీకరించారు. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మిస్తున్న మాస్ మహారాజా’ రవితేజ హీరోగా ‘టచ్ చేసి చూడు’ చిత్రానికి మ్యూజిక్ డైరక్టర్ గా సైన్ చేశారు. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉండగానే ప్రీతమ్ కి మరో అఫర్ వచ్చింది.
ప్రస్తుతం ‘దువ్వాడ జగన్నాథం’ చేస్తున్న అల్లు అర్జున్, దీని తర్వాత వక్కంతం వంశీతో ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అనే సినిమా చేయనున్నారు. ఇందుకోసం ప్రీతమ్ ని సంప్రదించగా ఆయన వెంటనే ఒకే చెప్పినట్లు సమాచారం. ఈ రెండు సినిమాల పాటలు హిట్ అయితే ప్రీతమ్ కి అవకాశాలు వెల్లువెత్తడం గ్యారంటీ.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















