‘గుంటూరు కారం’ (Guntur Kaaram) తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram) నెక్స్ట్ సినిమాపై వెంటనే క్లారిటీ రాలేదు. అల్లు అర్జున్ (Allu Arjun) తో సినిమా ఉంటుందని ప్రకటన వచ్చినా.. అది కార్యరూపం దాల్చలేదు. సడన్ గా అట్లీతో అల్లు అర్జున్ సినిమా సెట్ అవ్వడంతో.. త్రివిక్రమ్ ప్లాన్స్ లో మార్పులు చోటు చేసుకున్నాయి.
ఏ హీరోతో సినిమా చేయాలి అనే డైలమాలో పడ్డారు త్రివిక్రమ్ (Trivikram) . దాదాపు ఏడాదిన్నర గ్యాప్ వచ్చింది కాబట్టి.. అర్జెంట్ గా ఓ మిడ్ రేంజ్ సినిమా చేయాలి. అందుకే వెంకటేష్ తో త్రివిక్రమ్ సినిమా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ తర్వాత రాంచరణ్ (Ram Charan) , ఎన్టీఆర్ (NTR) ..లతో కూడా సినిమాలు సెట్ చేసుకునే పనిలో పడ్డారు త్రివిక్రమ్. దీంతో వెంకటేష్ (Venkatesh) తో సినిమా కష్టమేమో అని అంతా అనుకున్నారు. ఈ కన్ఫ్యూజన్ కి నిర్మాత నాగవంశీ (Naga Vamsi) ఓ క్లారిటీ ఇచ్చేశాడు.
త్రివిక్రమ్ (Trivikram) సినిమాలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ లోనే చేస్తున్నప్పటికీ.. అక్కడి బాధ్యతలు చక్కబెట్టేది కూడా నాగవంశీనే. అందుకే త్రివిక్రమ్ సినిమాల గురించి నాగవంశీకి ఎక్కువ క్లారిటీ ఉంటుంది. తాజాగా ఆయన తన ట్విట్టర్లో త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా వెంకటేష్ (Venkatesh) తో ఉంటుందని.. అటు తర్వాత చేయబోయే సినిమా ఎన్టీఆర్ తో ఉంటుందని.. ప్రకటించేశారు.
మిగిలిన ప్రాజెక్టులు కూడా డిస్కషన్లో ఉన్నాయని.. త్రివిక్రమ్ (Trivikram) గారి నెక్స్ట్ సినిమాల గురించి బయట జరిగే ప్రచారాలు నమ్మొద్దని, తానే స్వయంగా ప్రకటిస్తానని నాగవంశీ చెప్పుకొచ్చారు. అయితే రాంచరణ్- త్రివిక్రమ్ ప్రాజెక్టు గురించి మాత్రం నాగవంశీ స్పందించలేదు.