‘నాచ్చియార్’ పై క్లారిటీ ఇచ్చిన నయన్!
- December 31, 2020 / 02:55 PM ISTByFilmy Focus
దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి నయనతార. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలనుకునే మేకర్లు ముందుగా ఆమెనే సంప్రదిస్తారు. గత కొన్నేళ్లలో తనకంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది ఈ బ్యూటీ. వరుసగా లేడీ ఓరియెంటెడ్ కథల్లో నటిస్తూ హిట్లు అందుకుంటుంది. ఇటీవల ఈమె నటించిన ‘అమ్మోరు తల్లి’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదిలా ఉండగా.. నయన్ ని లీడ్ రోల్ లో పెట్టి ఓ వీర వనిత కథను సినిమాగా తీయబోతున్నట్లు తమిళ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
శివగంగ సీమలో 17వ శతాబ్దంలో తెల్లదొరలతో పోరాడిన ధీరవనిత వేలు నాచ్చియార్ జీవితం ఆధారంగా సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో నయన్ ప్రధాన పాత్ర పోషించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై స్పందించిన నయన్.. అందులో నిజం లేదని అధికారికంగా వెల్లడించింది. నిజానికి ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ లో నటించడానికి నయన్ కి ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు కానీ ఇక్కడ దర్శకుడి విషయంలో అభ్యంతరాలు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

గతంలో ‘తిరుట్టుపయలే’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన సుశీ గణేషన్ ఈ సినిమాను రూపొందించబోతున్నారు. విక్రమ్ హీరోగా ఈ డైరెక్టర్ తెరకెక్కించిన ‘మల్లన్న’ సినిమా డిజాస్టర్ అయింది. గత పదేళ్లలో ఈ డైరెక్టర్ నుండి చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. అంతేకాదు సుశీకి వివాదాస్పద దర్శకుడిగా పేరుంది. అలాంటి దర్శకుడితో ఇప్పుడు సినిమా చేయడం అనవసరమని నయన్ భావించి ఉంటుందని ప్రచారం చేస్తున్నారు. నయన్ కాదన్న పక్షంలో కీర్తి సురేష్ తో సినిమా చేయాలని ఈ డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నాడు.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!














