ప్లాన్ చేంజ్ చేసిన ఎన్టీఆర్
- March 6, 2017 / 07:22 AM ISTByFilmy Focus
జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మూవీ షూటింగ్ జోరుగా సాగుతోంది. ఫిబ్రవరి 10న పూజా కార్యక్రమాలు నిర్వహించిన డైరక్టర్ బాబీ గత నెలలో తారక్ లేకుండా కీలక నటీనటులపై సన్నివేశాల చిత్రీకరన మొదలెట్టారు. ఈ రోజు నుంచి ఎన్టీఆర్ షూటింగ్లో పాల్గొంటారని అందరూ అనుకున్నారు. కానీ యంగ్ టైగర్ ప్లాన్ ని చేంజ్ చేశారు. దుబాయికి వెళ్లారు. ఇక్కడ షూటింగ్ పెట్టుకొని దుబాయ్ కి ఇంత సడన్ గా ఎందుకు వెళ్లారని ఆరా తీయగా అసలు విషయం బయట పడింది.
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీలో తారక్ త్రి పాత్రాభినయం చేస్తున్నారు. ఎన్టీఆర్ నటనలో వేరియేషన్స్ మాత్రమే కాకుండా బాడీలోను మార్పులు కనిపించాలని హాలీవుడ్ లెగసీ ఎఫెక్ట్స్ టెక్నీషియన్ వాన్సీ హార్ట్ వెల్ ని తీసుకున్నారు. అతనితో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర లుక్ డిఫరెంట్ గా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. హార్ట్ వెల్ ఎన్టీఆర్ బాడీ మెజర్మెంట్స్ తీసుకుని కొన్ని రూపాలు పంపిస్తే వాటితో తారక్త సంతృప్తి చెందలేదంట. అందుకే లుక్ ఫైనలైజ్ చేసుకోవాలని దుబాయ్ వెళ్లినట్లు సమాచారం. ఈ శ్రద్ద చూస్తుంటే అభిమానులను ఎక్కడా అసంతృప్తి చెందకుండా ఉండేందుకు ఎన్టీఆర్ చాలా కష్టపడుతున్నట్లు అర్ధమవుతోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















