జై లవ కుశ విషయంలో అదే ఫాలో అవుతున్న ఎన్టీఆర్
- April 24, 2017 / 02:14 PM ISTByFilmy Focus
బాబీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న జై లవ కుశ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో 55 కోట్ల బడ్జెట్ తో కల్యాణ రామ్ నిర్మిస్తున్న ఈ మూవీలో తారక్ మూడు పాత్రల్లో నటిస్తుండడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అంతేకాదు బాలీవుడ్ కెమెరా మెన్ సీ కే మురళీధరన్, హాలీవుడ్ లెగసీ ఎఫెక్ట్స్ టెక్నీషియన్ వాన్సీ హార్ట్ వెల్ వంటి ప్రముఖ టెక్నీషియన్లు పని చేస్తుండడంతో ఇది క్రేజీ ప్రాజక్ట్ గా మారింది. ఈ సినిమా గురించి ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. జై లవ కుశని సెప్టెంబర్ 1న రిలీజ్ చేయాలని తారక్ అనుకుంటున్నారని తెలిసింది.
ఎందుకంటే తన గత చిత్రం ‘జనతా గ్యారేజ్’ గతేడాది సెప్టెంబర్ 1 న రిలీజై ఇండస్ట్రీ హిట్ సాధించింది. తనకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. అందుకే ఆ విషయాన్నీ దృష్టిలో ఉంచుకొని అదే రోజు ‘జై లవ కుశ’ ను కూడా విడుదల చేయాలనీ భావిస్తున్నట్లు సమాచారం. రాశీ ఖన్నా, నివేత థామస్, నందిత రాజ్ తో పాటు హంసా నందిని నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూడనున్నాం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.


















