రికార్డులను తిరగరాయనున్న పవన్, త్రివిక్రమ్ మూవీ
- December 24, 2016 / 10:44 AM ISTByFilmy Focus
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అత్తారింటికి దారేది మాత్రం కలక్షన్ల వర్షం కురిపించి రికార్డులను క్రియేట్ చేసింది. 131 కోట్లు రాబట్టి పవన్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. మళ్లీ వీరిద్దరి కలయికలో ఫిల్మ్ రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో నటిస్తున్న “కాటమరాయుడు” పూర్తికాగానే త్రివిక్రమ్ డైరక్షన్ లో మూవీ ప్రారంభం కానుంది. ఇందుకోసం టెక్నీషియన్లతో పాటు ఆర్టిస్టుల సెలక్షన్ కూడా డైరక్టర్ పూర్తి చేశారు.
“దేవుడే దిగి వచ్చినా..” అనే టైటిల్ అనుకుంటున్న ఈ చిత్రానికి ఖుషి సినిమాకు కెమెరామెన్ గా పనిచేసిన ప్రముఖ ఫోటో గ్రాఫర్ పీసీ శ్రీరామ్ ని తీసుకున్నారు. తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ పాటలను అందించనున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించే ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్లుగా నటించనున్నారు. ఇలా పక్కా ప్లాన్ తో వెళ్తోన్న డైరక్టర్ తీరు చూస్తుంటే ఈ చిత్రం అత్తారింటికి దారేది రికార్డులను తిరగరాయడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలో రాజకీయాల్లో బిజీ కానుండడంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురి కూడా రికార్డ్స్ పైనే ఉన్నాయని చెప్పుకున్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















