Nani , Sujeeth: నాని – సుజీత్ ప్రాజెక్టు ‘పీపుల్ మీడియా’ వద్దకి?
- May 17, 2024 / 09:23 PM ISTByFilmy Focus
నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా సుజీత్ దర్శకత్వంలో ఓ క్రేజీ మూవీ రూపొందాల్సి ఉంది. ‘డీవీవీ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై డీవీవీ దానయ్య (DVV Danayya) ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మించాలని అనుకున్నారు. కానీ కథ ప్రకారం ఈ ప్రాజెక్టుకు రూ.120 కోట్ల బడ్జెట్ పెట్టాల్సి ఉందట. ఇదే హీరోతో దానయ్య ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) అనే సినిమాని నిర్మిస్తున్నారు. మరోపక్క దర్శకుడు సుజీత్ తో (Sujeeth) కూడా ‘ఓజి’ (OG Movie) అనే భారీ బడ్జెట్ సినిమాని నిర్మిస్తున్నారు దానయ్య.
ఇలాంటి టైంలో నాని- సుజీత్ కాంబో మూవీకి మళ్ళీ అంత బడ్జెట్ పెట్టాలి అంటే.. అది ఆయనకు తలకు మించిన భారం అవుతుంది. అందుకే దానయ్య ఆలోచనలో పడ్డారు. అయితే దానయ్యకి ఓ గొప్ప అలవాటు ఉంది. ఏదైనా క్రేజీ కాంబినేషన్ ఆయన సెట్ చేసుకుంటే.. అది ఆయన నిర్మించే పరిస్థితుల్లో లేకపోతే వేరే నిర్మాతలకు కొంత అమౌంట్ తీసుకుని రైట్స్ ఇచ్చేస్తూ ఉంటారు. ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) విషయంలో ఆయనకు ఇలాంటి డీల్స్ చాలా వచ్చాయి.

కానీ రాజమౌళి పై నమ్మకంతో స్వయంగా ఆయనే నిర్మించుకున్నారు. అయితే ప్రభాస్ (Prabhas) – మారుతి (Maruthi Dasari)..ల ‘రాజా సాబ్’ ని (The Rajasaab) నిర్మించే రైట్స్ ని ఆయన ‘పీపుల్ మీడియా’ కి ఇచ్చేశారు. అది కూడా ఫ్యాన్సీ ఆఫర్..కే..! ఇప్పుడు సుజీత్ – నాని..ల ప్రాజెక్టుని సైతం దానయ్య.. ‘పీపుల్ మీడియా’ వారికి అప్పగించేసినట్టు ఇండస్ట్రీ టాక్. ఇది కూడా ఫ్యాన్సీ రేటుకేనట. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.















