నటుడిగా, సినిమా కథల ఎంపిక విషయంలో తేజ సజ్జా తనెంత స్పెషల్ అనేది ఇప్పటికే చూపించేశాడు. కుర్ర హీరోలు అలాంటి కథలను ఎంచుకోవడానికి ఒకటి రెండుసార్లు ఆలోచించుకునే స్క్రిప్ట్లతో సినిమాలు చేస్తున్నాడు. ఆ సినిమాలు చేయడం కాదు.. వాటిలో మంచి విజయాలు కూడా అందుకుంటున్నాడు. అయితే అతని మీద ఉన్న ఒకే ఒక కంప్లైంట్ సింపతీ గేమ్ ఆడతాడు అని. ‘హను – మాన్’ సినిమా విడుదల సమయంలో సింపతీ గేమ్ ఆడాడు అని మహేష్ ఫ్యాన్స్ అంటారు. మొన్నీమధ్య ‘మిరాయ్’ విడుదలకు ముందు కూడా ఇలాంటి కామెంట్లే వచ్చాయి.
ఇప్పుడు ఈ విషయమంతా ఎందుకు అనుకుంటున్నారా? తనను తొక్కేశారని ఎక్కువగా చెప్పే తేజ సజ్జా ఓ సినిమాలో హీరోయిన్ పాత్రను తొక్కేశాడు అనే విషయం బయటకు వచ్చింది. తేజ సజ్జా కెరీర్ ప్రారంభంలో చిన్న సినిమాలు కొన్ని చేశాడు. అందులో ‘అద్భుతం’ సినిమా కొటి. కరోనా –య లాక్డౌన్ సమయంలో ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది. మల్లిక్ రామ్ రూపొందించిన ఈ సినిమాలో రాజశేఖర్ తనయ శివానీ రాజశేఖర్ హీరోయిన్గా నటించింది.
ఆ సినిమా విడుదలకు ముందు ఫిలిం చాంబర్లో ఒక వివాదం నడిచింది. అప్పుడు దాని గురించి మాట్లాడినా ఆ తర్వాత ఎవరూ మాట్లాడలేదు. ఇప్పుడు ఆ విషయం గురించి చిత్ర నిర్మాత మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఇన్డైరెక్ట్గా మాట్లాడారు. టీవీ ఆర్టిస్ట్ సుధీర్ హీరోగా ఆయన నిర్మించిన ‘గోట్’ సినిమా ప్రచారంలో భాగంగా తన పాత సినిమాల్లో వివాదాలు రేగిన అంశాల గురించి మాట్లాడారు. ఈ క్రమంలోనే తన సినిమాలో హీరో, ఎడిటర్ కలిసి 15 నిమిషాలకు పైగా నిడివి ఉన్న సీన్లు తీయించేశారని చెప్పారు.
కరోనా – లాక్డౌన్ వల్ల ఓటీటీలో రిలీజ్ చేసిన సినిమాలో రన్ టైం 2 గంటల 21 నిమిషాలుగా ఉండగా.. కొన్ని రోజులకు అది 2 గంటల 4 నిమిషాలకు తగ్గిపోయిందని తెలిపాడు. ఏంఆ అని చూస్తే హీరోయిన్ ఉన్న కొన్ని సన్నివేశాలను సినిమా నుండి తొలగించేశారని తేలిందని చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. హీరోయిన్ డామినేషన్ ఉందనే ఉద్దేశంతో హీరో అలా చేశాడని కూడా చెప్పారు. ఆ విషయంలో జీవిత రాజశేఖర్ సీరియస్ అయ్యారని.. ఇష్యూను ఫిలిం ఛాంబర్ వరకు తీసుకెళ్లారని గుర్తు చేశారు.