బాలయ్య.. ఫ్యాన్ను కొట్టడంపై పూరీ ఆసక్తికర వ్యాఖ్యలు!
- August 18, 2017 / 06:15 AM ISTByFilmy Focus
నందమూరి బాలకృష్ణ తన సిబ్బందిని, అభిమానులను కొట్టడంతో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. దానిపై పూరి జగన్నాథ్ తనదైన స్టైల్లో కామెంట్ చేశారు. బాలకృష్ణ తన అభిమానుల్ని కొడితే అదొక లవ్ స్టోరీ అంటూ చెప్పి చప్పట్ల మోత మోగించారు. నిన్న సాయంత్రం ఖమ్మంలో “పైసా వసూల్” ఆడియో ఫంక్షన్ ఆనందోత్సాహాల మధ్య జరిగింది. వాన వస్తున్నప్పటికీ పట్టించుకోకుండా బాలయ్య కోసం నిలబడి చూసారు. ఈ కార్యక్రమంలో పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. ” ఏ హీరోకి అయినా బౌన్సర్లు కావాలి, బాలయ్యకు ఆ బౌన్సర్లు అవసరం లేదు, ఎందుకంటే అభిమానుల్ని బాలయ్యే కంట్రోల్ చేస్తారు” అంటూ నంద్యాలలో జరిగిన సంఘటన పై వచ్చిన విమర్శలను తిప్పికొట్టారు.
బాలయ్యతో ఈ సినిమాను తీయకుండా ఉండి ఉంటే తనకి బాలకృష్ణ గొప్పతనం తెలిసేది కాదని వివరించారు. అంతేకాదు ఎమ్మెల్యే గా బాలకృష్ణ నిరంతరం హిందూపురం అభివృద్ధి గురించి ఆలోచిస్తూ ఉంటారని వెల్లడించారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో ఆనంద్ ప్రసాద్ నిర్మించిన పైసా వసూల్ సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















